Begin typing your search above and press return to search.
టీడీపీలో హీరో,విలన్ రెండు బాబేనట
By: Tupaki Desk | 18 Oct 2016 12:00 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేయడంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తాజాగా మరో సెటైరికల్ కామెంట్ చేశారు. అనంతపురం జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి రఘువీరా రెడ్డి రైతు భరోసా యాత్ర నిర్వహించారు. పాదయాత్ర నిర్వహించి పంటల పరిస్థితిని పరిశీలించి అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ రెయిన్ గన్ల ద్వారా 4 లక్షల ఎకరాల పంట కాపాడామని చెప్పిన చంద్రబాబు పంటల బీమా - పంట నష్టపరిహారం చెల్లించకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. గత మూడేళ్లుగా పంట నష్టపరిహారం - బీమా అందక రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. రైతుల విషయంలో బాబు కామెంట్లు చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో హీరో - విలన్ పాత్రలు రెండూ ముఖ్యమంత్రే పోషిస్తున్నారని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు కరవుతో విడదీయలేని బంధం ఉందని కరెక్టుగా చెప్పాలంటే చంద్రబాబు - కరవు అవిభక్తకవలలు లాంటి వారని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటి వరకు పూర్తిగా ఏ రైతుకూ రుణమాఫీ రాలేదని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోగా వారిని సైతం మోసం చేశారని రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం హామీ అమలుకు నోచుకోక చాలా గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి జిల్లాలోని అన్ని మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీని నిలుబెట్టుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అట్టహాసంగా రెయిన్ గన్ ఉపయోగించి నీరందించిన గుండువారిపల్లికి చెందిన రైతు వేరుశెనగ పంట పూర్తిగా ఎండిపోయిందని రఘువీరా చెప్పారు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులు బస చేసిన ముఖ్యమంత్రి 4 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో వేరుశెనగ పూర్తిగా ఎండిపోయిందని, కంది పంటనయినా కాపాడి రైతులకు ఊరట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. రైతుల వెన్నంటి నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒకసారి రైతులకు రుణమాఫీ చేయగా, మూడుసార్లు వడ్డీమాఫీ చేశామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
చంద్రబాబుకు కరవుతో విడదీయలేని బంధం ఉందని కరెక్టుగా చెప్పాలంటే చంద్రబాబు - కరవు అవిభక్తకవలలు లాంటి వారని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటి వరకు పూర్తిగా ఏ రైతుకూ రుణమాఫీ రాలేదని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోగా వారిని సైతం మోసం చేశారని రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం హామీ అమలుకు నోచుకోక చాలా గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి జిల్లాలోని అన్ని మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీని నిలుబెట్టుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అట్టహాసంగా రెయిన్ గన్ ఉపయోగించి నీరందించిన గుండువారిపల్లికి చెందిన రైతు వేరుశెనగ పంట పూర్తిగా ఎండిపోయిందని రఘువీరా చెప్పారు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులు బస చేసిన ముఖ్యమంత్రి 4 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో వేరుశెనగ పూర్తిగా ఎండిపోయిందని, కంది పంటనయినా కాపాడి రైతులకు ఊరట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. రైతుల వెన్నంటి నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒకసారి రైతులకు రుణమాఫీ చేయగా, మూడుసార్లు వడ్డీమాఫీ చేశామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
