Begin typing your search above and press return to search.

రఘురామకృష్ణం రాజుకు జగన్ షాక్

By:  Tupaki Desk   |   16 Oct 2020 5:10 PM GMT
రఘురామకృష్ణం రాజుకు జగన్ షాక్
X
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయన వైసీపీకి వ్యతిరేకంగా గళమెత్తుతూ పార్టీలో అసమ్మతి రాజేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బహిరంగంగా పార్టీ మీద వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం ఎంపీ రఘురామకు దిమ్మదిరిగే ట్రీట్ మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా ఆ దిశగా పావులు కదిపినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ రఘురామ పోస్ట్ ను ఊస్ట్ చేసింది. వైసీపీ ఎంపీగా ఉంటూ ఆయనకు కేంద్రంలో దక్కిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామను తప్పించారు.

ఇక రఘురామకృస్ణం రాజు స్థానంలో వైసీపీ ఎంపీ బాలశౌరికి ఆ పోస్టును కట్టబెట్టారు. దీంతో ఇంతకాలం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ గా వ్యవహరించిన రఘురామకృష్ణంరాజు ఆ పదవి కోల్పోయినట్లైంది.

అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇన్నాళ్లు ఈ పదవితో కేంద్రంలో చక్రం తిప్పిన రఘురామకు వైసీపీ గట్టి షాక్ ఇచ్చినట్టైంది. ఇక ఆయనపై అనర్హత వేటు వేయించే దిశగా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.