Begin typing your search above and press return to search.

సడెన్ గా ప్రభాస్ తో భేటీ అయిన వైసీపీ నేత

By:  Tupaki Desk   |   26 Jan 2020 7:40 PM IST
సడెన్ గా ప్రభాస్ తో భేటీ అయిన వైసీపీ నేత
X
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ప్రభాస్. ఇటీవల ఆయన నటించిన సాహో సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా బాలీవుడ్‌లో మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతం జిల్ సినిమా దర్శకులు రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో సాగుతోంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత - నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణంరాజు అక్కడకు వచ్చారు. ప్రభాస్, ఆయన పెదనాన్న కృష్ణంరాజుతో కాసేపు మాట్లాడారు. వారి మధ్య సినిమాతో పాటు రాజకీయాలకు సంబంధించిన చర్చ కూడా వచ్చాయని తెలుస్తోంది.

రఘురామ కృష్ణంరాజు షూటింగ్ స్పాట్‌ కు వెళ్లి చర్చలు జరపడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా లేక క్యాజువల్‌ గా కలిశారా తెలియాల్సి ఉంది. కానీ ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కృష్ణంరాజు బీజేపీలో ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన ప్రభాస్‌ను వెంట బెట్టుకొని వెళ్లి ప్రధాని మోడీని కలిశారు.

ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవితో కూడా కలిసి పని చేశారు కృష్ణంరాజు. కానీ ఆయన అంతకుముందు, ఆ తర్వాత ఎప్పుడు బీజేపీతోనే ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు శాసన మండలి రద్దు అంశం టీడీపీ - వైసీపీ మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ నేపథ్యంలో కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది.