Begin typing your search above and press return to search.

కేబీసీలో కేటీఆర్ ట్వీట్ పై ప్రశ్న..

By:  Tupaki Desk   |   4 Sep 2021 10:30 AM GMT
కేబీసీలో కేటీఆర్ ట్వీట్ పై ప్రశ్న..
X
దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి'. ఈ షోకు హిందీలో విపరీతమైన ఆదరణ ఉంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. ఆయన గంభీరమైన స్వరంతో ఈ షోకు మంచి రేటింగ్ తీసుకొస్తున్నాడు.

ఇప్పటివరకు సామాన్యులు, సెలబ్రెటీలు ఈ షోలో ఆడి కోట్లు గెలుచుకున్నారు. ఇటీవలే ఓ అంధురాలు కూడా రూ.కోటి గెలుచుకొని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ షోలో క్రికెట్ స్టార్స్ సెహ్వాగ్, గంగూలీ పాల్గొన్నారు. దీంతో వారిపై అమితాబ్ బచ్చన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ క్రమంలోనే షో మధ్యలో 39వ ప్రశ్నగా అమితాబ్ బచ్చన్ ఓ ప్రశ్న అడిగారు. అందులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ కు సంబంధించిన ప్రశ్న రావడంతో గంగూలీ, సెహ్వాగ్ లకు ఆ ప్రశ్న చిక్కుముడిగా మారింది.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో రెండు మెడిసన్ పదాలు రాసి వాటిని సరిగ్గా పలికే వారు ఉన్నారా? అనే విధంగా ట్వీట్ చేశారు. ఇలాంటి పదాలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథూర్ సమాధానం చెప్పగలరని అంటూ ఆయనను ట్యాగ్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు అమితాబ్ నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి'లో ప్రశ్నగా రావడంతో తెగ వైరల్ అవుతోంది. అందులో నోరు తిరగని కోవిడ్ 19 మెడిసిన్ లిస్ట్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ వీరిలో ఎవరికి ట్యాగ్ చేశారంటూ అమితాబ్ బచ్చన్ స్వయంగా గంగూలీ, సెహ్వాగ్ లను ప్రశ్నించారు. నలుగురు పేర్లను ఆప్షన్ గా ఇచ్చారు. కపిల్ సిబల్, సుబ్రహ్మణ్య స్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ అనే ఆప్షన్ ఇచ్చారు.

తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించాడు. సరదాగా చేసిన పని అనుకోకుండా అమితాబ్ షోలో రావడంపై సంతోషంగా ఉందన్నారు. దాదా, సెహ్వాగ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

* కేటీఆర్ ట్వీట్ వైరల్ ఇదే