Begin typing your search above and press return to search.
సీరియస్ గా ఉన్న రాష్ట్రపతి సతీమణి ఆరోగ్యం
By: Tupaki Desk | 9 Aug 2015 10:27 AM ISTదేశ మొదటి పౌరుడి సతీమణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకునే విషయంలో ఆమె ఇబ్బంది పడుతుంటే.. సిబ్బంది ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూ చికిత్స చేస్తున్నారు.
మరోవైపు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒడిశా పర్యటనలో ఉన్నారు. తన జీవితభాగస్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఆయన.. హుటాహుటిన తన పర్యటనను మధ్యలోనే ముగించుకొని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్న విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.
మరోవైపు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒడిశా పర్యటనలో ఉన్నారు. తన జీవితభాగస్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఆయన.. హుటాహుటిన తన పర్యటనను మధ్యలోనే ముగించుకొని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్న విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.
