Begin typing your search above and press return to search.

నిర్భయ దోషుల్ని అలా ఉరి తీస్తారట!

By:  Tupaki Desk   |   13 Dec 2019 11:30 AM GMT
నిర్భయ దోషుల్ని అలా ఉరి తీస్తారట!
X
నిర్భయను అత్యంత అమానమీయమైన రీతిలో హత్య చేసిన ఉదతంలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను వేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం నలుగురు దోషుల్ని ఒకే సమయంలో ఉరి తీసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ ఇప్పటికే చేసినట్లుగా తెలుస్తోంది.

ఒకేసారి నలుగురి బరువు మోయగలిగే సామర్థ్యం ఉరికంబానికి ఉందా? అన్న విషయాన్ని టెస్టు చేయటం కోసం కొత్త టెక్నిక్ ను జైలు అధికారులు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్భయ నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

నలుగురి బరువును మూడు గంటల పాటు ఉరి కంబాలు మోయగలవా? లేవా? అన్ని నిర్దారించటం కోసం తీహార్ జైలు అధికారులు రెండుసార్లు ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెబుతున్నారు. దోషుల మెడకు ఉరితాళ్లు గట్టిగా బిగుసుకుపోకుండా ఉండేలా.. దానికి వెన్న రాయనున్నారు. దీంతో.. తక్కువ నొప్పితో దోషులు మరణించే వీలుందని చెబుతున్నారు.

తీహార్ జైల్లో ఉరి తీసే ప్రాంగణాన్ని1950లలో నిర్మించారు. రెండు స్తంభాల్ని కలుపుతూ మెటల్ బార్ ను ఏర్పాటు చేశారు. దీనికి ఉరితాడును కట్టనున్నారు. ఆ తాళ్ల వల్ల మెడ కోసుకుపోకుండా.. గాయాలు కాకుండా చూడాల్సి ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. ఉరిశిక్షను అమలు చేయటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయటంలో తీహార్ జైలు అధికారులు బిజీగా ఉన్నారు.