Begin typing your search above and press return to search.

అశ్లీల రాకెట్: 80 వీడియోలు.. 250 మంది బాధితులు

By:  Tupaki Desk   |   2 Aug 2021 7:37 AM GMT
అశ్లీల రాకెట్: 80 వీడియోలు.. 250 మంది బాధితులు
X
అందంగా వలవేస్తారు. మంచి అందమైన అమ్మాయిలా ఫోటోలు పెడతారు.. యువతను టార్గెట్ చేస్తారు. రోమాంటిక్ మాటలు చేష్టలతో యువతను ఆకర్షిస్తారు. వారితో చాటింగ్ లు చేస్తారు. రోమాంటిక్ ముచ్చట్లు చెబతారు.. శృంగార వాంఛ రెచ్చగొట్టి యువకులు బట్టలిప్పించి భరతనాట్యం చేయిస్తారు. అలా చేసి వారి నగ్నత్వాన్ని రికార్డు చేసి ఆ తర్వాత అసలు కథ షూరు చేస్తారు.. తాజాగా ఓ భారీ శృంగార రాకెట్ ముఠా గుట్టు రట్టు అయ్యింది.

ముంబైలో మరో భారీ అశ్లీల రాకెట్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ రోటీన్ శృంగార రాకెట్ కు భిన్నంగా సరికొత్త క్రైమ్ కు తెరతీశారు. చాలా మందికి తెలియని కోణంలో వెళ్లారు. దీంతో ఏకంగా 250మంది బాధితులు అయ్యారు. వీళ్లు యువత నుంచి బూతు వీడియోలు సేకరించి అది కూడా వాళ్లకు తెలియకుండా పక్కా ప్లాన్ ప్రకారం క్రైమ్ చేశారు.

ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ నేరం ఎలా జరుగుతుందో వివరంగా చెప్పారు. ఈ క్రైమ్ చేస్తున్నది ఐదుగురు.. వారిలో ఒకడు మైనర్ కావడం పోలీసులను విస్తుపోయేలా చేసింది. ఆ క్రైమ్ కథ ఇదీ..

ఈ ముంబై క్రైమ్ బ్రాంచ్ ముఠా ఫేస్ బుక్ లేదా ఇణ్ స్టాగ్రామ్ సోషల్ మీడియా సైట్లలో డూప్లికేట్ అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. అకౌంట్లలో గుర్తు తెలియని అమ్మాయి ఫొటోలు పెడుతారు.. తద్వారా ఎవరైనా ఆ అకౌంట్ ను చూస్తే అమ్మాయిదే అని అనుకునేలా చేస్తున్నారు. అకౌంట్ పేరు కూడా అమ్మాయి పేరు మీదనే ఉండడం విశేషం.

ఇలా ఐడీ క్రియేట్ చేశాక ఫేస్ బుక్ లో యువకులైన కుర్రాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపుతుంటారు. అవతలి వాళ్లు అమ్మాయికదా అని వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వారితో చాటింగ్ జరుపుతున్నారు.ఇలా కొన్ని రోజులు చాటింగ్ చేశాక.. మెల్లగా ప్రేమిస్తున్నట్టుగా డ్రామా ఆడుతారు. నీతో మాట్లాడాలని.. నీ ఫొటోలు పంపు అంటుంటారు. ఫొటోలు పంపాక నగ్నంగా ఫొటోలు పంపు అంటారు. అవి కూడా పంపాక.. నగ్నంగా వీడియో పంపమని కోరుతారు.నిండా ప్రేమలో మునిగిన కుర్రాళ్లు ఏం ఆలోచించకుండా నగ్న వీడియోలు పంపి వారి ఉచ్చులో చిక్కుకుంటారు. ఆ వీడియోను గ్యాంగ్ రికార్డ్ చేసి ఇక అసలు ఆట ప్రారంభిస్తుంది. నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ నగ్న వీడియోలు పంపిస్తామని.. ఇంటర్నెట్ లో పెడుతామని డబ్బు ఇవ్వకపోతే పరువు తీస్తాం అంటూ గ్యాంగ్ బెదిరిస్తుంది. చాలా మంది పరువు పోతుందనే భయంతో డబ్బులు ఇస్తున్నారు. ఇలా 250 మంది దాకా బాధితులయ్యారు.

తాజాగా ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ గ్యాంగ్ మొత్తం 10 నకిలీ ఐడీలను సృష్టించి సోషల్ మీడియా నకిలీ ఈమెయిల్ ల ద్వారా ఈ దందా సాగించినట్టు పోలీసులు తేల్చారు. 80 అశ్లీల వీడియోలను పోలీసులు వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అకౌంట్లను డిలీట్ చేయించారు.

దేశంలోని పలు నగరాల్లో ఈ గ్యాంగ్ దక్కోంది. నాగపూర్, ఉత్తరప్రదేశ్, ఒడిషాలలో దాక్కున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ లోని ఓ బ్యాంక్ అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేయిస్తున్నట్లుగా గుర్తించారు.