Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్ భార్యపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

By:  Tupaki Desk   |   9 March 2021 4:17 AM GMT
వైఎస్ జగన్ భార్యపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
X
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఈమె తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

ఉమెన్స్ డే సందర్భంగా సినీ నటి ‘పూనమ్ కౌర్’ ఆసక్తికర ట్వీట్ చేశాడు. సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిని ఆమె ఆకాశానికెత్తేశారు. ‘జీవితంలో నిరాశ పడిపోయే మనుషులని సహనం, ప్రేమ ఇంకా పట్టుదలతో ఆశ నింపి, శాశించే స్థాయి వరకు తీస్కొని వెళ్లడం చాలా తక్కువ మంది మనుషులకి ప్రత్యేకంగా
మహిళలకి సాధ్యం. అది నేను అమ్మలో,సుధామూర్తి గారిలో ఇంకా వైఎస్ భారతి గారిలో చూసాను,అంతే శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను !’ అని పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

ఈ ముగ్గురిని పోల్చడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి అయిన సుధామూర్తి భర్తకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆమె ఇచ్చిన డబ్బుతోనే నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు.

ఇక జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన భార్య భారతి ఎంతో ధైర్యంతో ఇంటి వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించారు. కష్ట సమయంలో భర్తకు అండగా నిలిచారు. తనకు కూడా అలాంటి శక్తిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని పూనమ్ కౌర్ ట్వీట్ చేశాడు.

అకస్మాత్తుగా ఆమె భారతిని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ వివాదాస్పద అంశాలపై స్పందించే పూనమ్ కౌర్ తాజాగా వైఎస్ జగన్ భార్యపై ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.