Begin typing your search above and press return to search.

వైసీపీది కూడా అదే పాట

By:  Tupaki Desk   |   10 April 2015 7:12 AM GMT
వైసీపీది కూడా అదే పాట
X
కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్ విషయంలో తెలంగాణ సమాజం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక్క ఎంఐఎం పార్టీ తప్ప! కానీ వారికి తోడుగా మేం ఉన్నాం అన్నట్లు మద్దతు ఇస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ పార్టీ ఎంపీ, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ కౌంటర్ అనుమానాస్పదంగా ఉందని సెలవిచ్చారు.

విచారణ ఖైదీలను కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో ఐదుగురిని ఎన్ కౌంటర్ పేరిట మట్టుపెట్టడం గర్హనీయమని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ తెలంగాణ ప్రజలు అనుమానపడేలా ఉందన్నారు. కేసీఆర్ ఏదో చేస్తారని ఆశిస్తే..ఆయన ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు.

తన పాలన ఎలా ఉందో తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. నమ్మి ఓట్లేసిన వృద్దులు , మహిళలు, రైతులు, విద్యార్థులను మోసం చేస్తున్నారని...వారి ఉసురు కేసీఆర్ కు తప్పక తగులుతుందని శాపం పెట్టారు. తనను తాను కాపాడుకునేందుకైనా.... ప్రజలు కోరుకునే పాలన అందించాలని సూచించారు.