Begin typing your search above and press return to search.

చింటూ ఆచూకీకి రూ.లక్ష రివార్డు

By:  Tupaki Desk   |   20 Nov 2015 6:45 AM GMT
చింటూ ఆచూకీకి రూ.లక్ష రివార్డు
X
చిత్తూరు మేయర్.. ఆమె భర్త హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఆచూకీ వెతకటం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. సొంత మేనమామ.. మేనత్తను హత్య చేసిన చింటూ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

ఇతగాడి ఆచూకీ కోసం తాజాగా డీజీ ఆర్పీ ఠాకూర్ ఒక ప్రకటన చేశారు. చింటూ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నజరానాగా ఇస్తామని పేర్కొనటం విశేషం. చిత్తూరు మేయర్.. ఆమె భర్త హత్యల విషయంలో ఏపీ సర్కారు సీరియస్ గా ఉండటం.. చింటూ ఆచూకీ ఎంతకు దొరకని నేపథ్యంలో తాజాగా రివార్డు ప్రకటించినట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. చింటూ వ్యవహారానికి సంబంధించి మరో ఆసక్తికర కోణం గురించి చెప్పుకొస్తున్నారు. చింటూను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ చింటూ పోలీసుల అదుపులో ఉంటే.. ఈ రివార్డు వ్యవహారం దేనికోసం అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.