Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ అస్త్రం.. మోడీ మళ్లీ చాయ్ వాలా నినాదం..

By:  Tupaki Desk   |   21 March 2021 3:30 PM GMT
సెంటిమెంట్ అస్త్రం.. మోడీ మళ్లీ చాయ్ వాలా నినాదం..
X
ప్రధాని మోడీ మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు. సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అదే మంత్రాన్ని జపిస్తున్నారు. దేశంలో పేదవాడి బాధలేంటో.. అస్సాంలో తేయాకు తోటల కార్మికుల వెతలు ఎలాంటివో చాయ్ వాలానైన తనకు మాత్రమే తెలుసు అని.. ఇతరులకు ఆ బాధలు తెలియదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

అస్సాం అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం బొకాఖట్ ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

అస్సాంలో అధికారంలోకి వస్తే సీఏఏ నిలుపుదలతోపాటు 5 కీలక హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్ పేర్కొన్న 5 హామీలను అస్సామీలు నమ్మవద్దన్న మోడీ.. అవన్నీ తప్పుడు వాగ్ధానాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అస్సాంలో అశాంతి రాజ్యమేలేదని.. ఐదేళ్ల కింద ఎన్డీఏ సర్కార్ రాక తర్వాతే రాష్ట్రంలో శాంతి, సుస్థిరత నెలకొన్నాయన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత ఒంటికొమ్ము ఖడ్గమృగాలను సైతం కాంగ్రెస్ కాపాడలేకపోయేదని.. బీజేపీ పాలనలో అక్రమ వేటగాళ్లను జైళ్లకు పంపిందని మోడీ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడడానికి కష్టించి పనిచేస్తున్నామని గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి మరో ఐదేళ్లు కొనసాగేలా ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.