Begin typing your search above and press return to search.

గుట్టల్లో రాసలీలలు చేస్తూ దొరికిన జంటకు షాక్

By:  Tupaki Desk   |   8 July 2020 3:30 AM GMT
గుట్టల్లో రాసలీలలు చేస్తూ దొరికిన జంటకు షాక్
X
వివాహా బంధాలకు అర్థం లేకుండా పోతోంది. ఈ మారుతున్న సంస్కృతి, పాశ్చత్య పోకడలతో అందరూ చెడిపోతున్నారు. ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి.

తాజాగా నల్గొండ జిల్లా కందుకూరు మండల పరిధిలోని పెద్ద పెద్ద గుట్టలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. కోదాడ-హుజూర్ నగర్ హైవే పక్కనే ఉండడంతో చాలా మంది ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం ఉన్న వాళ్లు ఈ గుట్టలను తమ రాసలీలలకు అడ్డాగా మార్చుకున్నారు.

ఈనెల 2న స్థానిక వ్యక్తి కూడా ఇలానే ఓ మహిళతో కలిసి గుట్టల్లోకి వెళ్లాడు. రాసలీలలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీస్ అంటూ వచ్చి ఫొటోలు తీశాడు. బెదిరింపులకు దిగాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీటిని మీ వాళ్లకు చూపిస్తానని.. పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తానని బెదిరించాడు. దీంతో కంగారుపడిన ఆ జంట తమవద్ద ఉన్న రూ.5వేల డబ్బులు ఇచ్చేశారు. మరిన్ని కావాలని బెదిరించాడు. దీంతో జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారయ్యాడు. పోలీసులు ఆ నకిలీ పోలీస్ ను పట్టుకొని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇలా కక్కుర్తి పడ్డ పాపానికి ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది.