Begin typing your search above and press return to search.

చనిపోయిన ఆవు మాంసాన్ని తిన్న 70 మందికి అస్వస్థత .. ఆరుగురి పరిస్థితి విషమం !

By:  Tupaki Desk   |   9 July 2020 8:00 AM GMT
చనిపోయిన ఆవు మాంసాన్ని తిన్న  70 మందికి  అస్వస్థత .. ఆరుగురి పరిస్థితి విషమం !
X
విశాఖపట్నంలోని మన్యంలో కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన వివాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మలకపాలెంలో చోటు చేసుకుంది. వెంటనే వారందర్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు.

ఒక్కసారే ఇంతమంది అస్వస్థతకు గురికావడంతో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులని ఆదేశించారు . విశాఖ మన్యంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అని, కలుషిత తినడం వల్ల గిరిజనులు కొంతమంది అస్వస్థతకు గురయ్యారని , మన్యంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో.. ఆహారం విషయంలో గిరిజనులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.