Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..అదే పేరుతొ వాపస్!

By:  Tupaki Desk   |   30 Dec 2019 12:37 PM GMT
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..అదే పేరుతొ వాపస్!
X
మూడు రాజధానుల ప్రకటన పై అమరావతి ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కుని వెళ్ళటం లేదు అని తెలిపారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి ఇవ్వొచ్చు. ఇతర ప్రాంతాల్లోని వారికి అభివృద్ధి అక్కరలేదా. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రం అంతటా సమ అభివృద్ధి జరుగుతుంది. రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారు. రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయరు. మంచి ప్యాకేజి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తాం అని తెలిపారు.

అలాగే 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసేయలనంటే సాధ్యం కాదు. తగుమాత్రంలో భూమి తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తాం. పూలింగ్ అని కొత్త విధానంలో భూమి తీసుకున్నారు. మళ్ళీ అదే విధానం లో వెనక్కు కూడా ఇవ్వొచ్చు. ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బోస్టన్ గ్రూపుపై అవాకులు చెవాకులు పేలుతున్న టీడీపీ నేతలు.. ఆ గ్రూపు సేవలను పలు సందర్భాలలో చంద్రబాబు కూడా వినియోగించుకున్న విషయం గుర్తించాలని అన్నారు.

అలాగే విశాఖలో సెక్రటేరియట్ పెడితే రాయలసీమ వాసులకు ఇబ్బంది అవుతుందన్న వాదనతో మంత్రి విబేధించారు. రాయలసీమకు కావాల్సింది తాగు, సాగు నీరే కానీ సెక్రటేరియట్ కాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమ ప్రాంతానికి ఇబ్బంది లేదని చెప్పారు. రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్ జనవరి 3న వస్తుందని ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పెద్దిరెడ్డి చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారు అని మంత్రి చెప్పారు.