Begin typing your search above and press return to search.

జగన్ ఆస్తుల లెక్క అడుగుతున్న తమ్ముడు

By:  Tupaki Desk   |   29 Sept 2015 6:00 PM IST
జగన్ ఆస్తుల లెక్క అడుగుతున్న తమ్ముడు
X
ఏపీలో పార్టీ అధినేతల ఆస్తుల వ్యవహారం ఇప్పుడు కొత్త రాజకీయ వేడిని రగిలిస్తోంది. మూడు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల్ని ప్రకటించటం.. దీనిపై ఏపీ విపక్షం విరుచుకుపడటం.. పలు విమర్శలు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తమ అధినేత చంద్రబాబు ఆస్తుల విషయంలో అవాస్తవాలు చెబుతూ.. తమ పరపతిని దెబ్బ తీసేలా వైఎస్సార్ కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కేశవ్ విమర్శిస్తున్నారు. బాబు ఆస్తులపై గతంలో కేసులు వేసి.. మధ్యలోనే వైఎస్ ఫ్యామిలీ వాటిని ఉపసంహరించుకోవటాన్ని గుర్తు చేశారు. జగన్ ఆస్తుల్ని ప్రకటించాలని డిమాండ్ చేసిన పయ్యావుల.. ఏం వ్యాపారం చేసి జగన్ కోట్లు సంపాదించారో చెప్పాలన్నారు.

బెంగళూరులోని 20 ఎకరాల భూమికి సంబంధించి జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని చెబుతూ.. జగన్ పేరు మీద కార్లు కూడా ఉన్నాయని.. వాటిని కూడా జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు. ఆస్తులు ఉండి కూడా వాటి గురించి చెప్పుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారన్న పయ్యావుల.. బాబుపై ఎన్ని కేసులు వేసినా ఏం కాదని చెప్పుకొచ్చారు. మరి.. తమ్ముడు కోరినట్లుగా జగన్ తన ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తారో..? లేదో..?