Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్తగా 10601 కరోనా కేసులు

By:  Tupaki Desk   |   8 Sept 2020 10:00 PM IST
ఏపీలో కొత్తగా 10601 కరోనా కేసులు
X
ఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. మంగళవారం కూడా అదే జోరు కొనసాగింది.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 10601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 70993 టెస్టులు చేయగా 10వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 517094 కు పెరిగాయి.

ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 73 గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4560కు పెరిగింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 10మంది, అనంతపురంలో 8, చిత్తూరులో 8మంది చొప్పున మరణించారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 69686గా నమోదయ్యాయి. మంగళవారంతో తూ.గోదావరిలో అత్యధికంగా ఏకంగా 1426 కేసులు నమోదయ్యాయి.