Begin typing your search above and press return to search.

బాబు, లోకేశ్ లకు ఆయన దానం చేశారట..

By:  Tupaki Desk   |   28 April 2017 7:58 AM GMT
బాబు, లోకేశ్ లకు ఆయన దానం చేశారట..
X
ఏపీ కేబినెట్ నుంచి ఇటీవల ఉద్వాసనకు గురైన పల్లె రఘునాథరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన శాఖలను సీఎం చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేశ్ లకు దానమిచ్చేశానన్నారు. పుట్టపర్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలో చంద్రబాబు తనను రాజీనామా చేయమని కోరగానే తాను చేసేశానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన సరదాగా పలు వ్యాఖ్యలు చేశారు. తన చేతిలో అప్పటివరకు ఉన్న శాఖలను అయిదుగురికి దానమిచ్చానన్నారు. మైనారిటీ శాఖను చంద్ర‌బాబుకు, ఐటీ శాఖను నారా లోకేష్‌ కు దానం చేసేశానని చెప్పారు. అంతేకాదు... సమాచారశాఖను కాలువ శ్రీనివాసులకు - టూరిజం శాఖను భూమా అఖిలప్రియకు - ఎన్‌ ఆర్‌ ఐ శాఖను కొల్లు రవీంద్రకు దానం చేశానని చెప్పారు. పల్లె మాటలతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.

కాగా మొన్నటి మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి పోగొట్టుకున్న పల్లె తన అసంతృప్తిని అప్పుడే వ్యక్తంచేసినా మిగతావారిలా ధిక్కార స్వరం మాత్రం వినిపించలేదు. మనసులో బాధ ఉన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడిపోయారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/