Begin typing your search above and press return to search.

ఐపీఎల్​లోకి పాక్​ ఆటగాళ్లు? ఛాన్స్​ ఉందా?

By:  Tupaki Desk   |   26 March 2021 9:30 AM GMT
ఐపీఎల్​లోకి పాక్​ ఆటగాళ్లు? ఛాన్స్​ ఉందా?
X
భారత్​ నుంచి విడిపోయిన పాకిస్థాన్​కు ఎప్పుడూ మనదేశంతో గొడవలు చికాకులు.. కశ్మీర్​ అంశం సహా వివిధ వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య నిత్యం యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని భారత్​ ఆరోపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇరు దేశాలు ఇక శాశ్వతంగా వైరి పక్షాలుగా ఉండావలిసిందేనా? శాంతి నెలకొనే అవకాశమే లేదా? అంటే కాదు అంటున్నాడు ఇంగ్లండ్​ కు చెందిన మాజీ క్రికెటర్​ కేవిన్​ పీటర్సన్​. ఇటీవల పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ కోవిడ్​ బారిన పడ్డాడు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇమ్రాన్​ కోలుకోవాలంటూ ఓ ట్వీట్​ పెట్టాడు.

అయితే ఇరు దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొనే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కేవిన్​ పీటర్సన్​ ఓ ట్వీట్ పెట్టాడు. పాకిస్థాన్​, భారత్​ మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నదే తన కల అని ఆయన ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్​ నెట్టింట్లో వైరల్​ గా మారింది. ఇదిలా ఉంటే భారత్​- పాకిస్థాన్​ మధ్య తరుచూ యుద్ధ వాతావరణం ఉండటంతో ఇరుదేశాలు మధ్య క్రికెట్​ టోర్నీలు కూడా జరగటం లేదు. కేవలం వరల్డ్ ​కప్​ లాంటి క్రికెట్​లు తప్ప .. సాధారణంగా ఇరుదేశాలు మధ్య క్రికెట్​ సీరిస్​ లు చాలా ఏళ్లుగా జరగడం లేదు. ఈ నేపథ్యం లో పీటర్సన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా అందరి కళ్లు తెరిపించింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరిస్​ జరిగే అవకాశం ఉందన్న వాదన తెరమీదకు వస్తున్నది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరిస్ జరిగి ఎనిమిదేళ్లవుతుంది. 2012-13లో ఇరుజట్లు భారత్ వేదికగా తలపడ్డాయి. అదే ఆఖరు. ఆ సీరిస్ లో పాక్​ వన్డే సీరిస్​ ను కైవసం చేసుకున్నది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో టీ20 సిరీస్‌ డ్రాగా ముగిసింది. భారత్‌, పాక్‌ లు చివరిసారిగా 2019లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌ లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌ లో టీమిండియా 89 పరుగల తేడాతో(డక్‌వర్త్‌) పాక్‌ పై ఘనవిజయం సాధించింది.


ఐపీఎల్​ 2022లో పాక్​ ప్లేయర్స్​ ఆడతారా?

ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌ లో మాత్రమే పాక్​ క్రికెటర్లు ఆడారు. ఆ తర్వాత ఎప్పుడూ పాక్​ క్రికెటర్లు ఆడలేదు. కానీ ఐపీఎల్​ లో ఆడాలని చాలా మంది పాక్​ క్రికెటర్లు కోరుకుంటున్నారు. కానీ వాళ్ల ఆశ అడియాసగానే మిగిపోతున్నది. ఇదిలా ఉంటే 2022 ఐపీఎల్‌ సీజన్‌ లో పాక్​ ఆటగాళ్లు ఐపీఎల్​ ఆడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక వేళ ఈ ఏడాది భారత్​, పాకిస్థాన్​ దేశాధినేతలు స్నేహపూర్వకంగా సమావేశమయితే పాక్​ క్రికెటర్లు ఐపీఎల్​ లో ఆడే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది భారత్‌ లో జరిగే టీ20 ప్రపంచ కప్‌ కోసం పాక్‌ క్రికెటర్లు భారత్‌ కు రానున్నారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతుందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి.