Begin typing your search above and press return to search.

తాతకు పెళ్లిసోకు మళ్లింది..! ఏం చేశాడంటే..!

By:  Tupaki Desk   |   12 March 2021 12:30 AM GMT
తాతకు పెళ్లిసోకు మళ్లింది..! ఏం చేశాడంటే..!
X
ఆయన వయసు 60 ఏళ్లు.. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య చనిపోయింది. కానీ ఆ వృద్ధుడికి పెళ్లిసోకు మళ్లింది. పెళ్లి చేయాలంటూ కుటుంబసభ్యులను అడిగాడు. కానీ ఈ వయసులో నీకు పిల్లను ఎవరు ? ఇస్తారంటూ టుంబసభ్యులు వారించారు. అయినా వృద్ధుడు మెట్టు దిగలేదు. నాకు పెళ్లి చేయాల్సిందేనంటూ మారాం చేశాడు. నాకు పెళ్లి చేస్తారా.. చేయరా అంటూ ఇటీవల ఏకంగా కరెంటు స్తంభం ఎక్కి.. నాకు పెళ్లి చేయకపోతే కరెంట్​ వైర్లు పట్టుకొని చనిపోతానంటూ బెదిరించాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు..

రాజస్తాన్‌లోని ఢోలాపూర్‌కు చెందిన 60 ఏళ్ల వయసున్న సోబ్రన్‌ సింగ్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీళ్లందరికీ పెళ్లిళ్లయ్యాయి. వాళ్లకు పిల్లలకు కూడా పుటారు. నాలుగేళ్ల క్రితం సోబ్రన్‌ భార్య మరణించింది. అప్పటి నుంచి సోబ్రన్​ ఒంటరితనంతో పీలవుతున్నాడు. తనకు పెళ్లి చేయాలంటూ సోబ్రన్​ కుటుంబసభ్యులను కోరుతున్నాడు.ఈ విషయంపై కుటుంబ సభ్యులతో సోబ్రన్​కు గొడవ జరిగింది.

దీంతో ఆవేశానికి లోనైన అతడు 11 కెవి హైటెన్షన్‌ వైర్లు ఉన్న కరెంటు స్తంభం ఎక్కి చచ్చిపోతానంటూ బెదిరించాడు. దీంతో స్థానికులు , పోలీసులు జోక్యం చేసుకొని అతడిని ఒప్పించే ప్రయత్నం చేశారు.విద్యుత్​ అధికారులు కరెంట్​ నిలిపివేశారు. అనంతరం కుటుంబసభ్యులు, స్థానికులు నచ్చజెప్పగా చివరకు సోరన్​ కిందకు దిగాడు. ప్రస్తుతం సోషల్​మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఈ వయసులో వృద్ధుడికి పెళ్లి అవసరమా? అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా 60 ఏళ్ల వృద్ధుడు పెళ్లి కోసం పట్టుబట్టడం సంచలనంగా మారింది.