Begin typing your search above and press return to search.

పబ్ కేసులో నటుడు నాగబాబు కుమార్తె నిహారికకు నోటీసులు

By:  Tupaki Desk   |   3 April 2022 8:08 AM GMT
పబ్ కేసులో నటుడు నాగబాబు కుమార్తె నిహారికకు నోటీసులు
X
హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీ బయటపడింది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్టు చెబుతున్నారు. ఫండింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడులు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు.

ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో డ్రగ్స్ తీసుకున్నవారు మాత్రమే ఉన్నారు. మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించినట్టు తెలిసింది. పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక,రాహుల్ సిప్లిగంజ్ సహా మిగతా వారికి నోటీసులు అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు.

డ్రగ్స్ కేసులో నిర్లక్ష్యంగా వహించిన బంజారాహిల్స్ సీఐని సస్పెండ్ చేశారు. అలాగే ఏసీపీకి చార్జ్ మెమో దాఖలు చేశారు. నాగబాబు కుమార్తె నిహారికను విచారించారు. అనంతరం కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు.

ఉదయమే 145 మందికి నోటీసులు ఇచ్చి పోలీసులు పంపించారు. నాగబాబు కుమార్తెతో సహా మరో ఐదుగురిని ఇప్పటివరకూ అదుపులో ఉంచుకొని నోటీసులు ఇచ్చి బయటకు పంపించారు.

రూంలోంచి బయటకు డ్రగ్స్ పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వాడారన్నది పోలీసులు విచారించినట్టు సమాచారం.