Begin typing your search above and press return to search.

యూపీలో నోటా సంచలనం.. ఆప్ సహా మిగతా పార్టీల కంటే ఎక్కువ ఓట్లు

By:  Tupaki Desk   |   11 March 2022 5:35 AM GMT
యూపీలో నోటా సంచలనం.. ఆప్ సహా మిగతా పార్టీల కంటే ఎక్కువ ఓట్లు
X
బీజేపీ ఘన విజయం సాధించిన ఉత్తరప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఓటు బ్యాంకు నమోదైంది. ప్రతి ఎన్నికల్లో నోటాకు ఓ మోస్తారు ఓట్లు వస్తాయి.

కానీ యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సహా ప్రముఖ పార్టీల కంటే కూడా ఎక్కువ ఓట్లు నోటాకు రావడం గమనార్హం. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం..

నోటా ఓట్ల శాతం 0.69 శాతంగా ఉంది. ఇది ఏఏపీ (0.35 శాతం), జేడీయూ (0.11 శాతం) ఓట్ల వాటాను అధిగమించిందని అని పీటీఐ నివేదించింది.

ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ(ఎంఐఎం)కి పోలైన ఓట్లలో 0.47 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఐకి 0.07 శాతం ఓట్లు రాగా.. ఎన్సీపీకి 0.05 శాతం ఓట్లు వచ్చాయి. శివసేనకు 0.03 శఆతం ఓట్లు వచ్చాయి.

సీపీఐ (ఎం), సీపీఐ (ఎంఎల్), ఎల్.జేపీ (ఆర్.వీ)లకు ఒక్కో దానికి 0.01 శాతం ఓట్లు వచ్చాయి. ఈఎస్ఐ వెబ్ సైట్ ప్రకారం.. ఏఐఎఫ్.బి, ఐయూఎంఎల్, ఎల్.జే.పీలకు ఎలాంటి ఓట్లు రాలేదు. 0శాతం ఓట్ షేర్ ను కలిగి ఉంది.

ఇక అత్యధికంగా బీజేపీ ఓట్ల శాతం 41.6గా వచ్చింది. ఇక రెండో స్థానంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి 32 శాతం ఓట్లు వచ్చాయి. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి 12.8 వఆతం, ఆర్ఎల్.డీకి 3.02 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్ షేర్ 2.38 శాతం వచ్చింది.

2017లో బీజేపీకి 312 సీట్లు వచ్చాయి. దాని మిత్రపక్షాలైన అప్నా దళ్, సుహెల్డేవ్ భారతీయ సమాజ్ పార్టీ కి వరుసగా తొమ్మిది, నాలుగు సీట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి 47, బీఎస్పీకి 19, కాంగ్రెస్ కు7, ఇతరులకు 5 సీట్లు వచ్చాయి.