Begin typing your search above and press return to search.

విజయవాడ అమ్మాయి హత్య కేసులో మరో ట్విస్ట్!

By:  Tupaki Desk   |   15 Oct 2020 5:31 PM GMT
విజయవాడ అమ్మాయి హత్య కేసులో మరో ట్విస్ట్!
X
విజయవాడ యువతి దారుణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మృతురాలు కి , హంతకుడు నాగేంద్రబాబుకు అంతకు ముందే పెళ్లైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయం మరెవరో చెప్పింది కాదు,హాస్పిటల్ ‌లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న నాగేంద్రబాబే స్వయంగా తన పెళ్లి గురించి అతని సోదరునితో చెప్పాడు అని అతని సోదరుడు చెప్తున్నాడు.

ఇద్దరం ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకున్నాం అని , అదే విషయం మాట్లాడటానికి నిన్న రాత్రి దివ్య వాళ్ల ఇంటికి నాగేంద్రబాబు వెళ్లాడని నిందుతుడు సోదరుడు చెప్తున్నాడు. అక్కడ నాగేంద్రకు, భాదిత యువతీ పేరెంట్స్‌ కు గొడవ జరిగిందని అతని సోదరుని మాటల ద్వారా తెలుస్తోంది. దివ్య తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. ఇక తాము కలిసుండలేమనే కోపంలో నాగేంద్రబాబు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుకుంటున్నారు. అయితే నిందుతుడు ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు అనే సంగతి మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.

మరోవైపు.. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటో సైతం బయటకు వచ్చింది. ఆ ఫోటోలో దివ్య మెడలో తాళిబొట్టు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లిద్దరూ అంత సన్నిహితంగా ఉండి సెల్ఫీ దిగడం.. ఆమె మెడలో తాళి ఉండటం చూస్తుంటే.. వాళ్లిద్దరికీ పెళ్లి అయ్యిందనే అనుమానం వ్యక్తం అవుతుంది. వీరి పెళ్లి కి యువతీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇక కలిసుండలేమని నాగేంద్రబాబు భావించి, ఆ అసహనంతోనే యువతిని చంపేసి.. తానూ ఆత్మహత్య యత్నం చేసుంటాడని నాగేంద్రబాబు కుటుంబ సభ్యులు అంటున్నారు. యువతి బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌. నాగేంద్రబాబు పెయింటర్. యువతీ ఇంటి వెనకాలే నాగేంద్రబాబు ఇల్లు. కాలేజీ రోజుల నుంచే దివ్య తేజస్విని వెంట నాగేంద్రబాబు తిరిగేవాడని తెలుస్తోంది. కొంతకాలానికి ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని చెబుతున్నారు.

అయితే భాదిత యువతి వరుసకి సోదరుడి వాదన మాత్రం మరోలా ఉంది. నిందుతుడు ,యువతీ సోదరుడు చిన్నప్పటి నుండి స్నేహితులని , ఈ ఘాతుకానికి పాల్పడే గంట ముందు కూడా నా దగ్గరే మాట్లాడుతూ ఉన్నాడని , నా దగ్గర ఎప్పుడు కూడా ఈ లవ్ మ్యాటర్ చెప్పలేదని , బహుశా ఇంట్లో వారికి తెలిసి , బయట పెట్టిండకపోవచ్చు అని అన్నాడు. నాకు తెలిసినంతలో వారిద్దరూ క్లోజ్ గా ఉండటం ఎప్పుడు చూడలేదని కానీ , జరిగిన ఘటన మాత్రం చాలా దారుణం అని , మా చెల్లి మెడపై , గొంతుపై , ఒళ్లంతా కత్తితో పొడిచి , అతడు కూడా పొడుచుకున్నాడని , ఆ తర్వాత అరుపులు విని లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నారని , వెంటనే హాస్పిటల్ కి తీసుకుపోతే మా చెల్లి అక్కడే మృతి చెందింది అని చెప్పారు. అయితే , ఈ కేసులో దాగి ఉన్న నిజాలు , అసలు ప్రేమించి , పెళ్లి చేసుకున్న యువతిని ఎందుకు కత్తితో పొడిచి చంపాడు, నిందుతుడు ముందు రోజు రాత్రి వారి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఏం జరిగింది అనే విషయాలు పోలిసుల విచారణలో తేలాల్సింది ఉంది. ప్రస్తుతం స్వామి తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.