Begin typing your search above and press return to search.

ఏపీలో అదే జోరు.. 5 లక్షలకు కేసులు

By:  Tupaki Desk   |   6 Sept 2020 6:30 PM IST
ఏపీలో అదే జోరు.. 5 లక్షలకు కేసులు
X
ఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. ఆదివారం కూడా అదే జోరు కొనసాగింది.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 10794 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72573 టెస్టులు చేయగా 10వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు 5 లక్షలకు చేరాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,98,125కు పెరిగాయి.

ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 70 గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4417కు పెరిగింది.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 66వేలకు పైగా నమోదయ్యాయి. ఆదివారంతో తూ.గోదావరిలో కేసులు రాష్ట్రంలోనే అత్యధికంగా 66948కి చేరింది.