Begin typing your search above and press return to search.

ఏపీలో పంజా: 2627 కేసులు..56 మృతులు

By:  Tupaki Desk   |   24 May 2020 2:20 PM IST
ఏపీలో పంజా: 2627 కేసులు..56 మృతులు
X
ఏపీలో మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కొన్ని రోజులుగా 50 కేసులు తగ్గకుండా సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11357 మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 66 కేసులు పాజిటివ్ గా తేలాయని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

తాజాగా కేసులు కలిపితే మొత్తం ఏపీలో కేసుల సంఖ్య 2627కి చేరింది. ఆదివారం మరో 29మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1807కు చేరింది.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 764 ఉన్నట్టు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కొత్తగా ఆదివారం నమోదైన 66 కేసుల్లో 8 చెన్నై కోయంబేడు మార్కెట్ కు వెళ్లొచ్చిన వారేనని తెలిపారు.

ఇక ఇప్పటివరకు ఏపీలో మరణించిన వారి సంఖ్య 56కు చేరింది. రాష్ట్రంలో అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలో 600కు పైగా నమోదయ్యాయి. తర్వాత గుంటూరులో 400,చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.