Begin typing your search above and press return to search.

శోభనం రాత్రే వింత చేష్టలతో టార్చర్.. నవ వధువు ఆత్మహత్య

By:  Tupaki Desk   |   4 Sep 2020 3:00 PM GMT
శోభనం రాత్రే వింత చేష్టలతో టార్చర్.. నవ వధువు ఆత్మహత్య
X
ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి శోభనం రోజే చుక్కలు చూపించాడు భర్త. ఆమెను మానసికంగా చిత్రవద చేశాడు. శాడిస్టు మొగుడి వింత ప్రవర్తనతో ఆమెకు జీవితం మీదే విరక్తి పుట్టింది. భర్త మాటలతో ఇక బతకాలన్న ఆశ చచ్చిపోయింది. ‘ఇంత అందంగా ఉన్నావు. నీకు కాలేజీలోనే బాయ్​ఫ్రెండ్​ ఉండే ఉంటాడు. అతడితో ఎన్నిసార్లు ఎంజాయ్​ చేశావు. మీ అమ్మకూడా అందంగానే ఉంది. ఆమెకు కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయా. మీ చెల్లికి కూడా బాయ్​ఫ్రెండ్​ ఉన్నాడా’ శోభనం రాత్రే భర్త ఇలాంటి ప్రశ్నలు అడగడంతో ఓ నవవధువు ఒంటిమీద కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె రాసిపెట్టిన సుసైడ్​ నోట్​లో ఆ శాడిస్తు భర్త ఆగడాలు వెలుగుచూశాయి.

ఆంధ్రప్రదేశ్​ సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా ఊజూర్​ సమీపంలోని గోవిందరెడ్డి ఎస్టేట్​ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతికి వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన యువకుడితో వివాహం అయ్యింది. యువకుడు పీహెచ్​డీ వరకు చదువుకొని లెక్చరర్​గా పనిచేస్తుండటంతో అమ్మాయి తల్లిదండ్రులు అతడికిచ్చి వివాహం చేశారు. బాధిత యువతి తండ్రి కూడా ఆర్మీలో పనిచేసి పదవివిరమణ పొందాడు. మంచి సంబంధం కుదిరిందని, ఇరుకుటుంబాలు భావించాయి. కరోనా సమయం కావడంతో కొద్దిమంది బంధువుల సమక్షంలోనే ఆగస్టు 23న పెళ్లి చేశారు. పెళ్లైన వారానికే వధువు ఆత్మహత్య పాల్పడింది. ఆగస్టు 30న బాత్ రూమ్ లో స్నానం చెయ్యడానికి వెళ్లిన బాధిత యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు మంటలు అదుపుచేసి చంద్రలేఖను రక్షించడానికి ప్రయత్నం చేశారు. అయితే తీవ్రగాయాలైన ఆమె మంటల్లో కాలిబూడిద అయ్యింది. కానీ బాధిత యువతి పుట్టింటి వాళ్లు.. అల్లుడిపై ఫిర్యాదు చేయడంతో అతడి రాక్షసత్వం వెలుగుచూసింది. విచారణ చేపట్టిన పోలీసులకు బాధిత యువతి రాసుకున్న సుసైడ్​ నోట్​ లభ్యమైంది. ఆ నోట్​ చదివి పోలీసులే షాక్​ అయ్యారు.

ఫస్ట్ నైట్ తనకు శోభనం జరగలేదని, రాత్రంతా తన భర్త అనుమానంతో సుటిపోటి మాటలు అన్నారని సుసైడ్​ నోట్​లో పేర్కొన్నది బాధిత యువతి. అయితే తన భర్తకు అనుమానపు పచ్చి ముదిరిందని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నది . డెత్ నోట్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు.

కథలో ఓ ట్విస్ట్​
నవదంపతుల పైళ్లైన రెండురోజులకే వాళ్ల ఇంట్లో ఓ పంచాయితీ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చంద్రలేఖతో పాటు చదువుకున్న ఓ యువకుడు ఇంటికి వెళ్లాడు. తాను పెళ్లికి రాలేకపోయానని, మీరిద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని, పెళ్లి జరిగిన తరువాత చిన్నచిన్న గొడవలు వస్తాయని, ఇద్దరు సర్దుకుపోవాలని చంద్రలేఖ స్నేహితుడు నవదంపతులు చెప్పి వెళ్లాడట. అప్పటినుంచే భార్యా, భర్తల మధ్య వివాదం మొదలైనట్టు సమాచారం. విచారణ పూర్తయ్యాక కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగుచూసే అవకాశం ఉన్నది.