Begin typing your search above and press return to search.

న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ నుండి మినహాయించాలి : మంత్రి హరీష్ రావు !

By:  Tupaki Desk   |   29 May 2021 9:30 AM GMT
న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ నుండి మినహాయించాలి : మంత్రి హరీష్ రావు !
X
జీఎస్టీ పరిధిలోకి న్యూట్రల్ ఆల్కహాల్‌ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదని , మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేస్తూ శాశ్వతంగా మినహాయించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 43వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని తోసిపుచ్చారు. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి కేవలం ఎక్సైజ్, పెట్రోల్ అండ్‌డిజీల్ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు.

సెస్, సర్ ఛార్జీల రూపంలోనే కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లో 18శాతం సర్ చార్జి, సెస్ ల రూపంలోనే వచ్చిందన్నారు. గత బడ్జెట్లో 18శాతం సెస్‌, సర్‌ఛార్జీల రూపంలో కేంద్రానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. 22.17లక్షల కోట్ల బడ్జెట్‌ లో సెస్, సర్‌ ఛార్జీల రూపంలో కేంద్రానికి రూ.3.99 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని అన్నారు. వీటిలో తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ. 3,439 కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతుందని వివరించారు. ఇప్పుడు ఆల్కాహాల్‌ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి రాష్ట్రాల అంతో ఇంతో సమకూరే ఆదాయాల మీద దెబ్బకొట్టొద్దన్నారు. ఆల్కాహాల్‌ ను అన్ని రాష్ట్రాల మంత్రులు కోరుతున్నట్లుగా జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఆల్కాహాల్‌ ను జీఎస్టీలో చేరిస్తే రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయన్నారు. కేంద్రం వసూలు చేస్తోన్న సెస్‌, సర్‌ఛార్జీల వల్లే రాష్ట్రాలు 41 శాతం ఆదాయాన్ని కోల్పోతున్నాయని, అందులో తెలంగాణ ప్రతీ ఏటా 2.102 శాతం ఆదాయం కోల్పోతుందని ఆయన గుర్తుచేశారు.