Begin typing your search above and press return to search.

దేశ చరిత్రలో ఇవాళ అద్భుతమైన రోజు: మోడీ

By:  Tupaki Desk   |   20 Sept 2020 8:00 PM IST
దేశ చరిత్రలో ఇవాళ అద్భుతమైన రోజు: మోడీ
X
వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై విపక్షాలు సభలో పెద్ద యుద్ధమే చేశాయి. రచ్చ రచ్చ జరిగింది. మరోవైపు విపక్షాలన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ నిర్వహించకుండా అప్రజాస్వామికంగా మూజువాణి ఓటుతో ఆమోదించారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఇదంతా ఓవైపు జరుగుతున్న వేళ ఈ వివాదంపై ప్రధాని మోడీ స్పందించారు.

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం చరిత్రలో ఇవాళ అద్భుతమైన రోజు అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ‘దశాబ్ధాలుగా రైతులు దళారుల బెదిరింపులకు గురయ్యారు. పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లులతో రైతుల కష్టాలకు విముక్తి ఏర్పడింది. ఈ బిల్లులు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి. వ్యవసాయంలో టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కోట్ల మంది రైతులకు ధన్యవాదాలు’ అని అన్నారు.

విపక్షాలు, పంజాబ్ ,హార్యానా రైతులు మాత్రం ఈ బిల్లుపై పోరాటం మొదలుపెట్టాయి. దీనిపై ఈ రోజు దేశమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే.