Begin typing your search above and press return to search.

వైసీపీ గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే ఏం లాభం?

By:  Tupaki Desk   |   5 April 2021 11:00 AM IST
వైసీపీ గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే ఏం లాభం?
X
తిరుపతిలో చినబాబు లోకేష్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీపై ఆయన మండిపడ్డారు. 21 మంది లోక్ సభలో, ఆరుగురు రాజ్యసభలో ఎంపీలుగా ఉండి ఏం సాధించారని లోకేష్ ప్రశ్నించారు.

టీడీపీకి ఉన్నది ముగ్గురే ఎంపీలని.. అయినా పార్లమెంట్ లో సింహాల్లా పోరాడుతున్నారని లోకేష్ చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం, విశాఖ రైల్వే జోన్ ఇలా అన్ని అంశాల్లోనూ కేంద్రాన్ని నిలదీసేది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రమేనన్నారు.

కేంద్రం ఏం చెబితే దానికి తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఏమైనా ఉంటుందా? అని లోకేష్ ప్రశ్నించారు. పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతు కావాలని.. ప్రధాని మోడీని చూసి ప్యాంట్ తడుపుకునే బ్యాచ్ కాదని లోకేష్ ఎద్దేవా చేశారు.

కేంద్రమంత్రిగా పనిచేసి సుధీర్ఘ అనుభవం ఉన్న పనబాక లక్ష్మీని టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టామన్నారు. పనబాక లాంటి మీ ఇంటి లక్ష్మీ కావాలో.. పార్లమెంట్ లో పడుకొని జగన్ రెడ్డి పాదసేవ చేసే ఎంపీ కావాలో తేల్చుకోవాలని లోకేష్ ప్రచారంలో విమర్శలు గుప్పించారు.