Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి.. జగన్ బర్త్ డే ఒకే రోజా..?

By:  Tupaki Desk   |   22 Dec 2015 4:30 AM GMT
బ్రాహ్మణి.. జగన్ బర్త్ డే ఒకే రోజా..?
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సోమవారం అని తెలుసు. అదే రోజు మరో ప్రముఖ వ్యక్తి బర్త్ డే కూడా. ఒకేరోజు చాలామంది పుట్టినరోజులు జరగటం మామూలే. కానీ.. రెండు వైరుధ్యాలున్న ప్రముఖుల పుట్టిన రోజులు ఒకే రోజు కావటం కాస్తంత ఆసక్తికరమే సుమా. డిసెంబరు 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ విపక్ష నేత పుట్టిన రోజుతో పాటు.. ఎన్టీఆర్ మనమరాలు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు.. నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి పుట్టిన రోజు ఒకటే కావటం విశేషం.

రెండు భిన్న ధ్రువాలైన రాజకీయ పక్షాలకు చెందిన ఇళ్లల్లో ఇద్దరు ప్రముఖుల పుట్టిన రోజులు ఒకటే కావటం కాస్తంత ఆసక్తికరమే. జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ అసెంబ్లీలో జగన్ సీటు దగ్గరకు వచ్చి మరీ బర్త్ డే విషెస్ చెప్పటం తెలిసిందే. జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు అభినందనలు చెప్పారు. వారి అభినందనలపై జగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. థ్యాంక్స్ చెప్పారు.

ఇక.. బ్రాహ్మణి విషయానికి వస్తే.. ఆమె తన పుట్టినరోజు వేడుకల్ని కాస్త భిన్నంగా జరుపుకున్నారు. ఇటీవల పోటీ పరీక్షల కోసం ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వారిని ఎంపిక చేసి.. వారికి అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉచిత శిక్షణ కోసం దాదాపు 12 వేలమంది దరఖాస్తు చేసుకుంటే.. 130 మంది విద్యార్థుల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎంపిక చేసింది. వారికి విశేష అనుభవం ఉన్న అధ్యాపకుల చేత శిక్షణ ఇప్పిస్తోంది. ఈ విద్యార్థులతో కలిసి బ్రాహ్మణి తన జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. ట్రస్ట్ భవన్ లో వీరి మధ్య కేక్ కట్ చేసి.. తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఏమైనా ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే రెండు కుటుంబాల్లోని వ్యక్తుల పుట్టిన రోజు ఒకే రోజు కావటం విశేషంగానే చెప్పాలి.