Begin typing your search above and press return to search.

ఎస్పీవై రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్..?

By:  Tupaki Desk   |   24 March 2016 10:14 AM IST
ఎస్పీవై రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్..?
X
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. తాజాగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఉదంతం వింటే ఇది నిజమనిపించక మానదు. అప్పటివరకూ నిక్షేపంగా ఉండి.. ఒక కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొన్న ఎస్పీవైరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావటం విస్మయానికి గురి చేస్తోంది.

నంది పైపుల సంస్థ అధినేతగా.. ఎంపీగా సుపరిచితులైన ఎస్పీవై రెడ్డి బుధవారం తన నియోజకవర్గంలోని ఉండుట్ల గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం నంద్యాలకు చేరుకున్న ఆయన ఇంటికి వెళ్లారు. ఆ వెంటనే కుప్పకూలిపోవటంతో వెంటనే నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని తేల్చి.. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. అప్పటివరకూ ఆరోగ్యంగా.. ఉల్లాసంగా తిరిగిన వ్యక్తి హటాత్తుగా తీవ్ర అస్వస్థత కావటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.