Begin typing your search above and press return to search.

వైసీపీ నేతలపై నాగబాబు ‘మీమ్స్’ కౌంటర్..

By:  Tupaki Desk   |   29 Sep 2021 6:30 AM GMT
వైసీపీ నేతలపై నాగబాబు ‘మీమ్స్’ కౌంటర్..
X
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పోసాని ప్రెస్ మీట్ జరుగుతుండగానే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పవన్ సోదరుడు నాగబాబు పోసాని వ్యాఖ్యలపై స్పందించారు. తనదైన శైలిలో వ్యంగ్యంగా మీమ్స్ తో విమర్శించారు. పోసాని కృష్ణ మురళితో పాటు ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.

ఏపీ ప్రభుత్వం సినీ టికెట్ల విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరుపునే టిక్కెట్లు విక్రయిస్తామని, నిర్మాతలకు లాభాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులెవరూ స్పందించలేదు. అయితే సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తీవ్రంగా స్పందించారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరైన ఆయన టిక్కెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

ఈ క్రమంలో మరో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఏపీ మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డాడు. రాజకీయంగానే కాకుండా పర్సనల్ లైఫ్ పై పోసాని వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకదశలో పోసాని ప్రెస్ మీట్ జరుగుతుండగానే పవన్ అభిమానులు ప్రెస్ క్లబ్ కు చేరుకొని హడావుడి చేశారు. దీంతో ఇప్పుడు అసలు విషయం పక్కనబడి పవన్ వర్సెస్ పోనాని అన్నట్లుగా మారింది. ఈ తరుణంలో పవన్ కుటుంబ సభ్యులు తమదైన శైలిలో స్పందించారు. పవన్ సోదరుడు నాగబాబు మీమ్స్ ద్వారా విమర్శించారు.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు కొన్ని మీమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వంతో పాటు పోసానిపై విమర్శలు సంధించారు. అనేక ప్రశ్నలకు మీమ్స్ తో సెటైర్ ఇచ్చారు. సినీ టిక్కెట్ల విక్రయంలో రాజుకున్న వివాదంపై నాగబాబు మీమ్స్ ను తయారు చేయించారు. విక్రమార్కుడు సినిమాలోని రవితేజ, బ్రహ్మానందం దొంగతనం చేసి పంచుకున్న డబ్బుల వీడియోను పోస్టు చేయించారు. ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. ఎప్పుడైనా సరిగా పంచావురా’ అనే బ్రహ్మానందం కామెంట్ ను హైలెట్ చేశారు.

ఏపీ మంత్రి పేర్ని నాని అడిగిన ప్రశ్నలకు నాగబాబు పంచ్ డైలాగ్ లతో మీమ్స్ పోస్టు చేశారు. పేర్ని నాని ప్రపంచంలో అడుగు పెట్టలేమంటూ చెత్తకుప్పలను చూపించారు. ఏపీని అమ్మేసి వచ్చిన డబ్బుతో అతడికి వైద్యం చేయిద్దామని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక ఆన్లైన్ టిక్కెట్ల గురించి స్పందిస్తూ కంటెంట్ ఉన్న వాడికి కటౌట్ చాలు అన్నారు.

పోసాని గురించి ఒక్క మాట అని సమాధానమిస్తూ సమరసింహారెడ్డి పోస్టర్ చూపించారు. ఆ సినిమాలోని ‘కుక్క పిల్ల మొరిగిందనుకో..’ అన్న డైలాగ్ కు పోసాని కృష్ణ మురళి ఫొటోను షేర్ చేశారు. అలాగే ‘సన్నాఫ్ ఇండియా’ ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడిన డైలాగ్ లను పోస్టు చేశారు. మీరు ఏ బ్రాండ్ తాగుతారు అన్న ప్రశ్నకు ప్రెసిడెంట్ మెడల్, గెలాక్సీ, భూం భూం ఫొటోలను ఫోస్టు చేశారు. ఇలా సినీ నటుల మధ్య జరుగుతున్న పోరు సోషల్ మీడియా వేదికగా వేడి పుట్టిస్తోంది.