Begin typing your search above and press return to search.

మాన్సాస్ ట్రస్ట్ సంచలనం.. గేటుకు తాళం

By:  Tupaki Desk   |   15 Dec 2020 5:30 PM GMT
మాన్సాస్ ట్రస్ట్ సంచలనం.. గేటుకు తాళం
X
విజయనగరం గజపతిరాజుల కుటుంబ తగాదాలు రచ్చ కెక్కుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత వైఖరితో ఇప్పటికే మిగతా కుటుంబ సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును కూలదోసి గద్దెనెక్కిన సంచయిత వల్ల ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి.

తాజాగా మాన్సాస్ ట్రస్ట్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొంది. ఎంఆర్ కాలేజీ గ్రౌండ్ అయోధ్య మైదానం గేటుకు తాళాలు వేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ పేరుతో ఓ నోటీసును గేటుకు అంటించారు. విద్యార్థులు, కాలేజీ సిబ్బంది తప్ప ఎవరూ లోపలికి రావడానికి అనుమతి లేదని ప్రస్తావించారు.

ఈ నిర్ణయంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాలేజీ మైదానంలో వాకింగ్ చేస్తున్నామని.. ఇప్పుడు తాళాలు వేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి కాలేజీ గేటు ముందు స్థానికులు నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై మాన్సాస్ ట్రస్ట్, ఎంఆర్ కాలేజీ స్పందించాల్సి ఉంది.

ఇక విజయనగరంలో ప్రసిద్ధి చెందిన ఎంఆర్ కాలేజీ ని ప్రైవేటు పరం చేస్తారని ప్రకటించడంతో దుమారం రేగింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత తాజాగా ఎంఆర్ కాలేజీని అన్ ఎయిడెడ్ కాలేజీగా మార్చాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయడంతో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కాలేజీని ప్రైవేటు పరం చేయడంపై పూసపాటి వంశీయులు తప్పు పడుతున్నారు.