Begin typing your search above and press return to search.

కేసీఆర్ కుమార్తెకు బుల్లెట్ ఫ్రూప్ వెహికిల్

By:  Tupaki Desk   |   10 Jan 2016 10:21 AM IST
కేసీఆర్ కుమార్తెకు బుల్లెట్ ఫ్రూప్ వెహికిల్
X
తెలంగాణ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ అయిన కవితకు బుల్లెట్ ఫ్రూప్ వెహికిల్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో పెరిగిన మావో కదలికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కవిత భద్రతపై నిఘా వర్గాలు అందించిన సమాచారంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

మావోల నుంచి కవితకు ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో.. ఆమె భద్రతను సమీక్షించినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భద్రతలో భాగంగా బుల్లెట్ ఫ్రూప్ వెహికిల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కుమార్తె కావటం.. ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కవిత సెక్యూరిటీని మరింత టైట్ చేశారు. ముఖ్యమంత్రి కుమార్తె కవితకు మావోల నుంచి ముప్పు ఉందన్న అంశం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.