Begin typing your search above and press return to search.

షాకింగ్ :కొడుకుకి కరోనా..కుప్పకూలిన తల్లి!

By:  Tupaki Desk   |   20 April 2020 7:51 AM GMT
షాకింగ్ :కొడుకుకి కరోనా..కుప్పకూలిన తల్లి!
X
కరోనా వైరస్..ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకి ప్రపంచంలోని ప్రతి దేశం కూడా అతలాకుతలం అవుతుంది, ముఖ్యంగా అమెరికా దీని దెబ్బకి అల్లాడిపోతోంది. ఇండియా లో కూడా ఈ మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ కరోనాను కట్టడిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ను ఎంత సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఇకపోతే , తాజాగా కర్ణాటక రాష్ట్రం - బాగల్‌ కోట జిల్లా జమఖండిలో శనివారం రాత్రి ఒక హృదయ విదారకమైన ఘటన జరిగింది. కొడుక్కి కరోనా లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్న తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జమఖండికి చెందిన 47 ఏళ్ల వయస్సు వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కొడుక్కి కరోనా సోకింది అన్న విషయం తల్లికి తెలియగానే ఇంట్లోనే ఉన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికీ బీపీ - షుగర్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి కరోనా ప్రకారం అంత్యక్రియలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర అధికారులను ఆదేశించారు. ఇకపోతే కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 384 మందికి కరోనా సోకగా ..14 మంది కరోనా భారిన పడి మృతి చెందారు.