Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ కు భారత్ పంచ్

By:  Tupaki Desk   |   13 Nov 2022 1:33 PM GMT
పాకిస్తాన్ కు భారత్ పంచ్
X
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఆ దేశ ఆటగాళ్లు, అభిమానుల ఓవర్ యాక్షనే. సెమీస్ లో భారత్ ఓడిపోగా.. ఇదే పాక్ అభిమానులు, ఆ దేశ అధ్యక్షుడు కూడా ట్విట్టర్ లో ఎద్దేవా చేస్తూ ట్వీట్లు చేశారు.

'ఇండియా బౌలర్లలా.. పాకిస్తాన్ బౌలర్లు చేతకాని వారు కాదు.. మా ఫైనల్ లో జాగ్రత్త ఇంగ్లండ్' అని షోయాబ్ అక్తర్ నిన్న కామెంట్స్ చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోవడంతో బ్రోకెన్ హార్ట్ సింబల్ పెట్టాడు.

దీనికి భారత బౌలర్ మహ్మద్ షమీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. 'సారీ బ్రదర్.. కర్మ అంటే ఇదే' అని పంచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెమీస్ లో టీమిండియాను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ ఫైనల్ లోనూ పాకిస్తాన్ మన భారత్ కంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. 137/8 పరుగులకే కట్టడి చేసింది. ఇక బ్యాటింగ్ లో సావధానంగా చేసి బెన్ స్టోక్స్ 52 పరుగులతో అజేయంగా గెలవడంతో కప్ కొట్టింది.

భారత జట్టు కంటే తక్కువ పరుగులు చేసిన పాకిస్తాన్ పై భారత అభిమానులు సెటైర్లు కురిపిస్తున్నారు. ఇక బౌలింగ్ లో మనకంటే కాస్త నయంగా బౌలింగ్ చేశారు. షాహీన్, రౌఫ్, నసీమ్ లాంటి ప్రపంచ శ్రేణి బౌలర్లు ఉండడంతో ఇది సాధ్యమైంది. అయినా వీరు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను ఏం ప్రభావింతం చేయలేదు.

పాకిస్తాన్ ప్రధాని సెమీస్ లో మనం ఓడిపోగానే 162/0 అంటూ ఎద్దేవా చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఫైనల్ లో ఓడిపోవడంతో భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు పాకిస్తాన్ ను ఎద్దేవా చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు.