Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఏమైంది?

By:  Tupaki Desk   |   29 March 2021 7:16 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఏమైంది?
X
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి తీవ్రంగా మారడంతో రెండు సర్జరీలు చేసినట్లుగా తెలుస్తోంది.

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి అధికారికంగా తెలిపారు. రోజా కోలుకుంటున్నారని.. ఐసీయూ నుంచి సోమవారం ఉదయం వార్డుకు తరలించారని చెప్పారు.

మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారని.. ఆమె ఆరోగ్యంపై తాజాగా ఓ ఆడియో టేప్ విడుదల చేశారు.

గత ఏడాదియే ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని.. కానీ గత ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్లుగా రోజా భర్త సెల్వమణి తెలిపారు. మరోసారి జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదా వేశారని తెలిపారు.

రోజా ఆరోగ్యం కుదుటపడుతోందని.. కోవిడ్ వ్యాప్తి చెందుతున్నందున నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆస్పత్రికి రావద్దని విజ్ఞప్తి చేశారు.

అయితే రోజాకు ఏమైంది? ఎందుకు రెండు ఆపరేషన్లు చేసుకున్నదన్నది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై అధికారికంగా రోజా అయితే స్పందించలేదు. ఆమె భర్త ఆడియో క్లిప్ ద్వారా రోజాకు ఆపరేషన్ జరిగిందని తెలుస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.