Begin typing your search above and press return to search.

రేప్ కేసులో మైనర్ల మాట: ఆ ఇద్దరి మాటలతోనే రేప్ చేశారట!

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:45 AM GMT
రేప్ కేసులో మైనర్ల మాట: ఆ ఇద్దరి మాటలతోనే రేప్ చేశారట!
X
సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఉదంతానికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపటం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని పలు విధాలుగా విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాల్ని వారు వెల్లడించినట్లుగా చెబుతున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మైనర్లను వేరుగా.. మిగిలిన వారిని వేరుగా విచారించిన పోలీసులు.. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా వేర్వేరుగా వారి నుంచి ఆధారాలు సేకరించి.. వారు వెల్లడించిన వివరాలు ఒకేలా ఉన్నాయా? లేదా? అన్న అంశాన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రేప్ ఉదంతంలో తమను మాటలతో రెచ్చగొట్టి రేప్ చేసేలా చేశారని పోలీసులకు మైనర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా వారు సాదుద్దీన్.. కొర్పొరేటర్కొడుకు పేర్లు పోలీసులకు చెప్పారన్న మాట వినిపిస్తోంది. ఆ అమ్మాయి పరువుకు భయపడి అత్యాచార విషయాన్ని బయటకు చెప్పదని.. భయపడాల్సింది లేదని సాదుద్దీన్.. కార్పొరేటర్ కొడుకు చెప్పిన మాటలతోనే తాము అత్యాచారానికి పాల్పడినట్లుగా మైనర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. వారి మాటలకు ప్రభావితమై.. తామీ పని చేశామే తప్పించి.. తాము జైలుపాలు అవుతామని ఊహించలేదని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

తాము ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని.. బాలికతో మొదట్నించి అమానుషంగా ప్రవర్తించింది సాదుద్దీన్.. కార్పొరేటర్ కొడుకేనని.. మొదట రేప్ చేసింది కూడా కార్పొరేట్ కొడుకేనని చెప్పినట్లుగా సమాచారం. కార్పొరేటర్ కొడుకు తర్వాత సాదుద్దీన్ రేప్ చేసినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.

పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురు మైనర్ల కస్టడీ మంగళవారానికి ముగియనుంది. అదే సమయంలో మరో ఇద్దరి కస్టడీ బుధవారానికి ముగుస్తుంది. మరోరెండు మూడు రోజుల విచారణలో మరెన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.