Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా మారిన త‌మిళ‌నాడు నిర్భ‌య

By:  Tupaki Desk   |   7 Jun 2017 7:03 AM GMT
సంచ‌ల‌నంగా మారిన త‌మిళ‌నాడు నిర్భ‌య
X
కొన్నేళ్ల క్రితం పారామెడిక‌ల్ విద్యార్థిని నిర్భ‌య‌ను క‌దులుతున్న బ‌స్సులో దారుణంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న దేశాన్ని ఎంత‌గా కుదిపేసిందో తెలిసిందే. ఆ కేసులో నిందితుల‌కు ఉరిశిక్ష వేసినా.. ఇంకా అమ‌లు కాలేదు. దారుణ నేరాలు చేసినా.. శిక్ష‌లు అంత త్వ‌ర‌గా అమ‌లు చేయ‌క‌పోవ‌ట‌మో.. ఏం జ‌రుగుతుందిలేన‌న్న బ‌రితెగింపో కానీ.. మృగాళ్ల బారిన ప‌డుతున్న బాధితుల సంఖ్య మాత్రం త‌గ్గ‌టం లేదు.

ఢిల్లీ నిర్భ‌య ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా త‌మిళ‌నాడులో తాజాగా జ‌రిగిన నిర్బ‌య ఉదంతం వింటే షాక్ తినాల్సిందే. చిన్న‌పిల్ల అని చూడ‌కుండా.. ఆమెపై దారుణానికి పాల్ప‌డిన వైనం వింటే.. స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌లదించుకోవాల్సిందే. అన్నెంపున్నెం ఎరుగ‌ని 15 ఏళ్ల బాలిక‌పై ముగ్గురు అత్యాచారం చేసిన వైనం ఇప్పుడా రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది.

ఇంత‌కీ జ‌రిగిందేమంటే.. త‌మిళ‌నాడులోని సేలం జిల్లాలోని శివారులోకి క‌రుప్పూరు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌కు ప్రైవేటు బ‌స్సులు తిప్పుతుంటారు. కిచ్చిపాళ‌యంకు చెందిన 15 ఏళ్ల బాలిక ఒక ప్రైవేటు స్కూల్లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. సోమ‌వారం రాత్రి ఎనిమిదిన్న‌ర గంట‌ల వేళ‌లో త‌ల్లిదండ్రుల‌తో గొడ‌వ ప‌డి.. కోపంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఎక్క‌డికి వెళ్లాలో తెలీక సేలం పాత‌బ‌స్టాండ్‌ కు చేరుకుంది. క‌రుప్పూరు వెళ్లే ప్రైవేటు బ‌స్సు క‌నిపించ‌టంతో అందులో ఎక్కేసి టికెట్ తీసుకుంది. లాస్ట్ స్టాప్ అయిన క‌రుప్పూరు ఇంజ‌నీరింగ్ కాలేజీ స‌మీపంలో అంద‌రూ దిగినా బాలిక మాత్రం ఉండిపోయింది. బ‌స్సులో ఉన్న ఇద్ద‌రు డ్రైవ‌ర్లు (మ‌ణివ‌ణ్ణ‌న్.. మురుగ‌న్‌).. కండెక్ట‌ర్ పెరుమాళ్ లు నెమ్మ‌దిగా మాట‌లు క‌లిపి జ‌రిగిందంతా తెలుసుకున్నారు.

బ‌స్సును క‌రుప్పూరులో దించ‌కుండా నారాయ‌ణ‌పాళెం వైపు బ‌స్సు మ‌ళ్లించారు. దీంతో భ‌య‌ప‌డిన బాలిక భ‌యంతో కేక‌లు వేయ‌గా.. నోట్లో గుడ్డ‌లు కుక్కిన మురుగ‌న్‌.. పెరుమాళ్ ఇద్ద‌రూ అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం మురుగ‌న్ బ‌స్సు న‌డుపుతుండ‌గా మ‌ణివ‌ణ్ణ‌న్ లైంగిక దాడికి తెగ‌బ‌డ్డాడు. దాదాపు గంట‌కు పైనే బ‌స్సు తిప్పుతూ.. ఆమెపై దారుణ లైంగిక హింస‌కు పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో బ‌స్సులో నుంచి పారిపోలేక‌.. వారి త‌ప్పించుకోలేక‌.. బిగ్గ‌ర‌గా వేస్తున్న కేక‌ల‌తో అక్క‌డి స్థానికులు బ‌స్సును అడ్డుకున్నారు. లోప‌ల‌కెళ్లి చూడ‌గా.. ప‌రిస్థితిని గుర్తించి..నిందితుల‌ను చిత‌క్కొట్టి పోలీసుల‌కు అప్ప‌గించారు. బాధితురాలిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. క‌దులుతున్న బ‌స్సులో రాక్ష‌సంగా అత్యాచారానికి పాల్ప‌డిన ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/