Begin typing your search above and press return to search.

కరోనా బారిన మరో కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   27 Aug 2020 9:00 PM IST
కరోనా బారిన మరో కేంద్రమంత్రి
X
కరోనా కబళిస్తోంది. వరుసగా ప్రముఖులను ఆవహిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఎక్కువశాతం మందికి సోకుతోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

కేంద్రంలో వరుసగా కేంద్రమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు కరోనా బారినపడ్డారు.

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు ఈ కరోనా బారిన పడగా.. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

కరోనా సోకినట్టు స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు, ప్రజలు కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.