Begin typing your search above and press return to search.

తుపాకీతో ఎంఐఎం నేత కాల్పులు.. ముగ్గురు సీరియస్

By:  Tupaki Desk   |   18 Dec 2020 3:15 PM GMT
తుపాకీతో ఎంఐఎం నేత కాల్పులు..  ముగ్గురు సీరియస్
X
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఎంఐఎం నేత తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. తాటిగూడలో ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్ చేత బూని స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.

ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఫారూఖ్ రెండు రౌండ్లు కాల్పులు జరపగా.. ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. బాధితులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా పాత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తొలుత ఇరువర్గాల మధ్య ఘర్షణ ఆ తర్వాత కాల్పులకు దారితీసినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీతో ఫారూఖ్ వీరవిహారం చేశాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఫారుఖ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఐజీ నాగిరెడ్డి తెలిపారు.