Begin typing your search above and press return to search.

ఇప్పటిదాకా చూసింది ట్రయలర్ మాత్రమేనట

By:  Tupaki Desk   |   17 Jun 2016 5:03 AM GMT
ఇప్పటిదాకా చూసింది ట్రయలర్ మాత్రమేనట
X
అత్యున్నత స్థాయిలో ఉన్న రాజకీయ నేతల నోటి నుంచి వచ్చే మాటలకు భిన్నమైన మాటల్ని చెప్పుకొచ్చారు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్. నిజాయితీకి నిలువెత్తు రూపంగా చెప్పుకునే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకూ సాగిన మోడీ పాలన అంతా ట్రయలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందు ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

నెల్లూరులో జరిగిన మేధావుల సదస్సులో మాట్లాడిన ఆయన.. రానున్న రోజుల్లో మోడీ పాలనను చూస్తారన్న ఆయన ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా మీద తన మాటను చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా.. అంతకంటే ఎక్కువ సాయం చేస్తుందన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో 1.15కోట్ల మంది తమ సబ్సిడీ గ్యాస్ ను వదులుకున్నారని.. వీరి నిర్ణయం కారణంగా కర్రలు.. బొగ్గు మీద వంట చేస్తూ క్యాన్సర్ బారిన పడుతున్న 5 కోట్ల మంది పేదలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరీకర్ మాటలన్నీ బాగానే ఉన్నా.. మోడీ చూపించే సినిమా గురించి మరికొన్ని వివరాలు చెప్పి ఉంటే బాగుండేది.