Begin typing your search above and press return to search.

ఆ ఎంబ్ల‌మ్ తాంత్రిక విద్య‌ల గుర్తు: క‌త్తి మ‌హేష్

By:  Tupaki Desk   |   7 Jan 2018 11:46 AM GMT
ఆ ఎంబ్ల‌మ్ తాంత్రిక విద్య‌ల గుర్తు: క‌త్తి మ‌హేష్
X

సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో ప్రెస్ మీట్ అనంత‌రం ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ....ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వ‌హించిన లైవ్ షోలో మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. పవన్ - త్రివిక్రమ్ లు క్షుద్రపూజలు చేశారని తన వద్ద వీడియో సాక్ష్యం ఉందని ప్రెస్ క్ల‌బ్ లో సంచలన ఆరోపణలను చేసిన మ‌హేష్ ....లైవ్ షోలో వాటిపై మ‌రిన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. వారిద్ద‌రూ క్షుద్ర పూజలు చేసిన కార‌ణాలు త‌న‌కు తెలీద‌ని, ఆ వీడియాలో మాత్రం కొన్ని తాంత్రిక విధానాల్లో పూజలు చేశార‌ని ఆరోపించారు. వారు రెండు - మూడు సార్లు తాంత్రిక పూజలు చేశార‌ని - త‌న‌ దగ్గర ఒక వీడియో మాత్రమే ఉంద‌ని తెలిపారు. పూజలు చేసే విధానాల గురించి త‌న‌కు తెలుస‌ని తాంత్రిక పూజల్లో వేసే ముగ్గుల గురించి తెలుసన్నారు. ఆ పూజ‌ల‌కు సంబంధించిన వీడియోను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని చెప్పారు. ఆ పూజారి పేరు నరసింహ అని, అవి ఎక్కడ చేశారో త‌న‌కు తెలియద‌ని మ‌హేష్ చెప్పారు.

ఆ టీవీ చానెల్ వారు ఆరా తీస్తే ఆ పూజారి - పూజ‌ల విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌న్నారు. సమాజాన్ని పక్కదోవ పట్టించే వ్యక్తులు (పవన్ - త్రివిక్రమ్) లు స‌మాజానికి ఆదర్శనీయంగా మార‌డం ప్రమాదకరమ‌న్నారు. దాంతోపాటు ‘జనసేన’ ఎంబ్లమ్ పై కూడా మ‌హేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌న‌సేన లోగో - ఎంబ్ల‌మ్....తాంత్రిక ముగ్గులా ఉంటాయన్నారు. దానిని జాగ్ర‌త్త‌గా గమనిస్తే ఆ విష‌యం తెలుస్తుంద‌ని, కొద్దిగా తాంత్ర విద్య‌ల పరిజ్ఞానం ఉన్న వాళ్లకు అర్థమౌతుందన్నారు. ఆ తాంత్రిక పూజలు నిర్వహించింది పవన్, త్రివిక్రమ్ లేన‌ని, ఆ వీడియోకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఉన్నాయన్నారు. వారిద్ద‌రూ ఆ వీడియో త‌మ‌ది కాద‌ని బుకాయించ‌డానికి అవ‌కాశం కూడా లేద‌న్నారు. ఆ షో లైవ్ లో మ‌హేష్ మాట్లాడుతుండ‌గానే...కొంత‌మంది ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌హేష్ ను బెదిరించారు. ప‌వ‌న్ పై ఇటువంటి అర్థం ప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తే తీవ్ర‌ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.