Begin typing your search above and press return to search.

లోకేష్ మీద వలంటీర్ ను పోటీకి పెట్టి గెలిపిస్తాం

By:  Tupaki Desk   |   21 Aug 2020 5:30 PM GMT
లోకేష్ మీద వలంటీర్ ను పోటీకి పెట్టి గెలిపిస్తాం
X
కరోనా సమయంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వదిలి రాకుండా అక్కడి నుంచే జూమ్ లో మీటింగ్ పెడుతున్నారని.. లోకజ్ఞానం లేని లోకేష్ వలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. అ.. ఆ.. లు రాని లోకేష్ ను చంద్రబాబు మంత్రిగా చేశారని.. లోకేష్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. లోకేష్ మీద ఒక వాలంటరీని పోటికి పెట్టి గెలిపిస్తామని.. మా సవాల్ కు చంద్రబాబు సమాధానం చెప్పాలని జోగి రమేశ్ డిమాండ్ చేశారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోడీకి లేఖ రాసిన చంద్రబాబు అందుకు ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు దివాళా తీసిన టీడీపీకి అధ్యక్షుడని.. హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు ప్రధానమంత్రికి, చీఫ్ సెక్రెటరీకి లేఖరాశారని మండిపడ్డారు. ఆధారాలు చూపించమంటే చూపించలేకపోయాడని.. గాలి వార్తలు రాసే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ప్రధానికి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు.

అంతర్జాతీయ అవినీతి సంఘానికి చంద్రబాబు అధ్యక్షుడని.. 30 లక్షల మంది మహిళ జీవితాల్లో చంద్రబాబు నిప్పులు పోశారని జోగి రమేశ్ మండిపడ్డారు. అవినీతికి పేటెంట్ చంద్రబాబు నాయుడు అన్నారు.