Begin typing your search above and press return to search.

ఈ బుడతడు మృత్యుంజయుడు .. రైలు మీద నుండి దూసుకెళ్లినా ...!

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:36 PM GMT
ఈ బుడతడు మృత్యుంజయుడు .. రైలు మీద నుండి దూసుకెళ్లినా ...!
X
రైల్వే పట్టాలపై గూడ్స్ రైలు ఛుకుచుకు అంటూ పరుగులు పెడుతోంది. ఇద్దరు లోకో పైలట్‌ లు రైలును కంట్రోల్ చేస్తూనే కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే , ఆ సమయంలో కొంత దూరంలో ఓ పిల్లాడు పట్టాలపై ఆడుకుంటూ కనిపించాడు. హారన్ గట్టిగా మోగించినా పక్కకు తప్పుకోలేదు. అతడిని ఎలాగైనా కాపాడాలని ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయితే బ్రేక్స్ వేయగానే సడన్ గా ఆగడానికి అది బస్సు కాదుకదా .. కొంచెం సమయం పడుతుంది. దీనితో బ్రేక్స్ వేసినా ట్రైన్ కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. కానీ అప్పటికే బాబు మీద నుంచి వెళ్లిపోయింది. రైలు ఆగిన వెంటనే ఇంజిన్ నుంచి ఇద్దరు లోకో పైలట్లు దిగి పట్టాలను పరిశీలించారు.

ఇంజిన్ కింది భాగంలో చిక్కుకుపోయిన పిల్లాడు.. ఏడుస్తూ.. భయపడుతూ కనిపించాడు. అంతేతప్ప ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగానే ఉన్నాడు. ఇంజిన్ కింద భాగంలో ఉండిపోయిన బాలుడిని లోకో పైలట్లు చాకచాక్యంగా బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు చూస్తే .. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాబ్‌ గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్లు బాలుడు రెండేళ్ల తన తమ్ముడితో కలిసి ఆడుకుంటూ వెళ్లిపోవడంతో.. రెండేళ్ల బాలుడు నడుచుకుంటూ పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో రైలు దూసుకొచ్చింది. లోకో పైట్ల ధీవన్, అతుల్ చాకచక్యంగా బ్రేకులు వేయంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఐతే రైలు ఆగిన తర్వాత ఆ బాబు భయంతో బిగ్గరగా ఏడ్చాడని, ముందు అతడి ఏడుపుని అపి, ఆ తర్వాత జాగ్రత్తగా ఇంజిన్ కింద నుంచి బయటకు తీసుకొచ్చినట్లు లోకో పైలట్లు తెలిపారు. మొత్తానికి ఆ చిన్నారి మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎంతో సాహసం, సమయస్ఫూర్తితో బాబను కాపాడిన లోకో పైలట్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించిన ఇరువురికి రైల్వే అధికారులు రివార్డుల‌ను ప్ర‌క‌టించారు.