Begin typing your search above and press return to search.

ధోనీ పరువు తీసిన లారా..!

By:  Tupaki Desk   |   20 April 2021 10:30 AM GMT
ధోనీ పరువు తీసిన లారా..!
X
ఐపీఎల్​ 2020లో వెనకబడ్డ సీఎస్​కే జట్టు.. ఐపీఎల్​ 2021 లో మాత్రం దూసుకుపోతున్నది. వరస విజయాలతో ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ధోనీ కూల్​ కెప్టెన్సీ తోడై సీఎస్​కే జట్టు వరస విజయాలను నమోదుచేస్తున్నది. నిన్న రాజస్థాన్​ రాయల్స్​ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్​కే గెలుపొందిన విషయం తెలిసిందే. సీఎస్‌కే 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రన్​ అవుట్​ కాకుండా ధోనీ చేసిన డైవ్​ అందరినీ ఆకట్టుకున్నది.అంతేకాక ఆర్​ ఆర్​ బ్యాట్స్​మెన్​ లను కట్టడి చేసేందుకు ధోనీ పకడ్బందీగా బౌలింగ్​ చేయించడం కలిసి వచ్చింది. దీంతో ప్రస్తుతం సీఎస్​కే జట్టుకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇదిలా ఉంటే ధోనీ ఆటతీరుపై వెస్టిండీస్​ క్రికెట్​ దిగ్గజం లారా స్పందించారు. తనదైన స్టయిల్​లో కామెంట్లు చేశారు. ఈ టైంలో ధోనీ నుంచి ఎక్కువ పరుగులు ఆశించలేమని.. అతడు విశ్రాంతి తీసుకొని యువకులకు అవకాశం ఇవ్వాలని లారా అభిప్రాయపడ్డాడు.ప్రస్తుతం సీఎస్​కే బ్యాట్స్​మెన్లు ఫామ్​ లో ఉన్నారు. అందువల్ల వాళ్లు ధోనీకి విశ్రాంతి ఇవ్వాలి. నిన్నటి మ్యాచ్​ లో మొయిన్‌ అలీ మెప్పించాడు. జడేజా, డుప్లెసిస్‌, రాయుడు, బ్రావో కూడా రాణించారు.

'ధోని పరుగులు చేయడం లేదని.. కొందరు సోషల్​మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇది సరికాదు. ఎందుకంటే ధోనీ ప్రస్తుతం కీపర్​గా, కెప్టెన్​ గా ఎంతో రాణిస్తున్నాడు. అతడిపై అంతకు మించిన అంచనాలు సరికావు. ధోనీ కనక ఒక్కసారి క్రీజ్​లో నిలదొక్కుకున్నాడంటే.. ఎంతటి విధ్వంసమైనా చేయగలడు. కానీ అతడు ప్రస్తుతం కెప్టెన్సీపై దృష్టి సారించాలి. ప్రస్తుతం సీఎస్‌కే జట్టు పరిపూర్ణంగా కనిపిస్తోంది' అని లారా పేర్కొన్నాడు.ప్రస్తుతం సీఎస్​కే జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.