Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోం కష్టం.. ఆఫీసులే ఇష్టం?

By:  Tupaki Desk   |   22 March 2022 10:30 AM GMT
వర్క్ ఫ్రం హోం కష్టం.. ఆఫీసులే ఇష్టం?
X
కరోనా రాకతో అందరి పని విధానం మారుతోంది. ఇప్పటికే మూడు వేవ్ లు దాటుకొని పనులు చేసుకుటున్నారు. చాలా మంది వర్క్ ఫ్రం హోం పేరిట ఇళ్లలో అష్టకష్టాలు పడుతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే వివిధ కంపెనీలు తమ ఆఫీసులకు తలుపులు తెరుస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరులు కేంద్రంగా నడుస్తున్న అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. వ్యాక్సినేషన్ వేయించుకున్న ఉద్యోగులందరినీ రెండో వేవ్ ముగియగానే ఆఫీసులకు రమ్మని కంపెనీలు కోరాయి. అయితే థర్డ్ వేవ్ రావడంతో కంపెనీలు వెనకడుగు వేశాయి. ఇప్పుడు మూడో వేవ్ కూడా ముగిసిన తర్వాత మళ్లీ కంపెనీలన్నీ ఉద్యోగులపై దృష్టిసారించాయి.

ఇప్పటికే పలు కంపెనీలు వారంలో రెండు మూడు రోజుల పాటు అనే ఆఫర్ ను ఇచ్చాయి. వారంలో ఐదు రోజుల వర్కింగ్ డేస్ లో రెండు మూడు రోజులు ఆఫీసులకు రావచ్చని.. కొన్ని కంపెనీలు పని విధానాన్ని అమలుచేస్తున్నాయి. పేరున్న కంపెనీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగులను ఒత్తిడి చేయడం లేదు.

ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి స్పందించారు. వర్క్ ఫ్రం హోమ్ ఇండియాకు సెట్ కాదన్నారు. పనిచేసుకోవడానికి ప్రత్యేక గతి భారతీయుల్లో చాలా మందికి లేకపోవడం.. ఇంటర్నెట్ స్పీడ్ ఇలాంటివి ఆటంకాలని పేర్కొన్నారు. మరి ఇవేమీ లేకుండానే రెండేళ్లుగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను బాగానే వాడుకున్నాయి. అలాంటిది ఇప్పుడు నారాయణమూర్తి ఆ అంశాలను ప్రస్తావించడం కాస్త విడ్డూరమేనని అనుకోవచ్చు.

ఇక వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల్లో నేర్చుకునే గుణం క్రమంగా నశిస్తుందని తేలింది. ఉద్యోగులు ఆఫీస్ కల్చర్ కు దూరం కావడం వల్ల వారిలో నైపుణ్యం తగ్గుతుందని గుర్తించారు. దీర్ఘకాలంలో ఇది దేశానికి మంచిది కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే పిల్లలు ఇళ్లలో ఉండి ఆన్ లైన్ క్లాసులకు పరిమితం కావడం వల్ల వారి మానసిక స్థితి ఇబ్బందికరం అయినట్టే.. ఉద్యోగుల్లో కూడా ఇదే తరహా ఇబ్బంది తలెత్తుతుందని ఈ విశ్లేషణ చెబుతోంది.

ఇళ్లలో రెండేళ్లుగా ఉండడం వల్ల బోర్ డమ్ తీవ్రమైందని.. భార్యభర్తలు రోజంతా ఒఖరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండడం అంతా ఏమీ లేదంటున్నారు. ఆఫీసులు తెరిస్తే చాలు.. తాము రెక్కలు కట్టుకు వెళ్లడానికి సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం పేరిట కంపెనీలు కూడా తమను విచ్చలవిడిగా వాడుకుంటున్నాయని వారు వాపోతున్నారు. ఆఫీసులకు వెళ్లడమే ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు ఉద్యోగులు.