Begin typing your search above and press return to search.

బోయివాడ అగ్ని ప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు

By:  Tupaki Desk   |   26 March 2022 7:59 AM GMT
బోయివాడ అగ్ని ప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు
X
హైదరాబాద్ లోని బోయివాడలో విషాదం నింపిన అగ్ని ప్రమాదం వెనుక సంచలన విషయాలు వెలుగు చూశాయి. 11 మంది కార్మికులు సజీవ దహనం అయిన ఈ అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రమాద ఘటనను త్రీడీ స్కానర్ తో క్లూస్ టీంలు పరిశీలించాయి. 11 మంది కార్మికులు సజీవ దహనం అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు.

షార్ట్ సర్క్యూట్ తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనావేస్తున్నారు. దీంతో స్క్రాప్ గోదాంలో మంటలు అంటుకోవడం ద్వారా కరెంట్ బోర్డులు, సిలిండర్ పేలుడు సంభవించినట్టు చెబుతున్నారు.

ఇక ఈ ప్రమాదంలో ఫ్యూజ్ లే కొంపముంచాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక్కో ఫ్యూజ్ లో అదనంగా మందమైన మూడు నాలుగు వైర్లు ఉన్నట్టు గుర్తించారు. కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ వైర్లపై నిప్పు రవ్వలు పడడం.. స్విచ్ బోర్డులు, గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు.

ఇక స్క్రాప్ గోదాంలో 10కిపైగా స్విచ్ బోర్డులు ఉన్నట్టు గుర్తించారు. గోదాంలో కరెంట్ ఎక్కువ వాడకంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడినట్టుగా చెబుతున్నారు.

ఇక ఇనుప మెట్లు ఉండడంతో పైనున్న వారు కిందకు రాలేకపోయారని.. దట్టమైన పొగ వల్ల సృహ కోల్పోయి మంటల్లో సజీవ దహనం అయినట్టు నిర్ధారణ వస్తున్నారు.

ఇక అగ్నిప్రమాదం, గ్యాస్ పేలుడు ధాటికి రేకులు పేలిపోయాయి. సిలిండర్ రెగ్యులేటర్ పక్కనే ఉన్న మరో షేడ్ పై పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ పిన్ సైతం సిలిండర్ లోకి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం విచారణలో ఈ విషయాలు నిగ్గు తేలినట్టు సమాచారం. ఆధారాలు త్వరలోనే బయట