Begin typing your search above and press return to search.

గోపీచంద్ మూవీపై డార్లింగ్‌ ఫ్యాన్స్ ఆశ‌లు.. అందుకేనా?

By:  Tupaki Desk   |   16 March 2022 3:29 AM GMT
గోపీచంద్ మూవీపై డార్లింగ్‌ ఫ్యాన్స్ ఆశ‌లు.. అందుకేనా?
X
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ న‌టించిన తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై బ‌న్నీ వాసు నిర్మించారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. స‌త్య‌రాజ్‌, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్‌తో మంచి అంచ‌నాల‌ను ఏర్ప‌ర్చుకున్న ఈ చిత్రం మే 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

అయితే ఇప్పుడు ఈ మూవీపై గోపీచంద్ అభిమానులే కాదు, డార్లింగ్ అభిమానులు సైతం భారీ అశ‌లు పెట్టుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న ప్ర‌భాస్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతోన్నాడని, త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డుతుంద‌ని అంటున్నారు. అంతేకాదు, అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రూపొందించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ ప్ర‌చారంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. నేష‌న‌ల్ హీరోగా స‌త్తా చాటుతున్న ప్ర‌భాస్ ఎలా మారుతి సినిమాకు ఓకే చెప్పాడంటూ కొంద‌రు విమ‌ర్శ‌లు సైతం గుప్పిస్తున్నారు. ఎందుకంటే, ఇప్ప‌టి వ‌ర‌కు మారుతి పెద్ద హీరోల‌తో వ‌ర్క్ చేసింది లేదు. గ‌తంలో విక్ట‌రీ వెంక‌టేష్‌తో 'బాబు బంగారం' సినిమా చేశాడు. కానీ, ఇది బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

అలాంటి డైరెక్ట‌ర్‌కు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే మారుతి తాజా చిత్రం పక్కా కమర్షియల్. ఈ మూవీ రిజ‌ల్ట్ బాగుంటే గ‌నుక‌.. ప్రభాస్ తో ఆయ‌న చేయ‌బోయే సినిమా పై కూడా మంచి బజ్ ఏర్పడుతుంది.

అందుకే మంచి మాస్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కిన 'పక్కా కమర్షియల్' సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాల‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆశ‌ప‌డుతున్నారు.