Begin typing your search above and press return to search.

ఏపీ చిరకాల కోరిక మా వల్లే సాధ్యమైంది.. సోము వీర్రాజు సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   26 March 2022 10:34 AM
ఏపీ చిరకాల కోరిక మా వల్లే సాధ్యమైంది.. సోము వీర్రాజు సంచలన ప్రకటన
X
ఏపీ చిరకాల వాంఛను నెరవేర్చామంటూ ఆ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు సోము వీర్రాజు. ఈ మేరకు విశాఖ రైల్వే జోన్ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఎప్పటి నుంచో విశాఖ రైల్వే జోన్ కోసం ఏపీ ప్రజలు, నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి బడ్జెట్ లోనూ ఏపీ నుంచి కేంద్రానికి ఈ డిమాండ్ వెళుతుంది.కానీ ఒక్కసారి కూడా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ఎట్టకేలకు విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడంపై ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీకి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వరాల జల్లులు కురిపించారన్న ఆయన.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యిందని కేంద్రమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు.

ఇక కోనసీమ రైల్వే లైన్ కు రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందని ప్రకటించారు. అదే విధంగా కడప-బెంగళూరుకు రైల్వే లైన్ కు రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయకపోవడంతో పనులు ఆగిపోతాయని ఆరోపించారు.

కడప-బెంగళూరు రైల్వే లైన్ స్టేట్ షేర్ కట్టించేవిధంగా ఉద్యమిస్తామని సోము వీర్రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని సోము వీర్రాజు అన్నారు.