Begin typing your search above and press return to search.

టీమిండియా అభిమానుల దెబ్బకు బాత్రూంలో దాక్కున్నాడట

By:  Tupaki Desk   |   30 Jun 2021 3:34 AM GMT
టీమిండియా అభిమానుల దెబ్బకు బాత్రూంలో దాక్కున్నాడట
X
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ విజేతగా కివీస్ జట్టు నిలవటం తెలిసిందే. టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యచ్ లో కివీస్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపులో కివీస్ పేసర్ జేమిసన్ కీలకమని చెప్పాలి. ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి టీమిండియా బ్యాట్స్ మెన్ల వెన్ను విరిచాడు. దీంతో.. ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చాడు. మైదానంలో బంతితో చెలరేగిపోయిన జేమిసన్.. మ్యాచ్ వేళ మైదానం వెలుపల తాను చేసిన పని గురించి తాజాగా వెల్లడించి హాట్ టాపిక్ గా మారాడు. తన కెరీర్ లో క్రికెట్ మ్యాచ్ చూడటానికి విపరీతమైన టెన్షన్ కు గురైన సందర్భం ఇదేనని చెప్పాడు. ఒకదశలో ఆ టెన్షన్ ను తట్టుకోలేక బాత్రూంలో దాక్కున్నట్లు చెప్పారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఫైనల్ మ్యాచ్ ను టీవీల్లో చూసే వారికి.. ప్రత్యక్షంగా స్టేడియంలో చూసే వారికి మధ్య ఈ మ్యాచ్ కు సంబంధించి ఒక వ్యత్యాసం ఉందన్నాడు. బంతి బంతికి టీమిండియా అభిమానులు చేసే గోలకు.. వారి నుంచి సామూహికంగా వచ్చే శబ్దాలకు.. ఏదో జరిగిపోయిందన్నట్లుగా ఉండేదని.. ఉత్కంటగా చూస్తే.. ఏమీ జరిగేది కాదన్నాడు. ప్రతి బంతికి వికెట్ పడినంత హడావుడి శబ్దాలు చేసే వారని.. దీంతో తాను తీవ్రమైన టెన్షన్ కు గురైనట్లు చెప్పాడు.

‘ఫ్యాన్స్ చేసే శబ్దాలకు వికెట్ పడిందేమోనన్న ఆందోళన చెందేవాడిని. తీరా చూస్తే.. బంతిని డిఫెండ్ చేయటమో.. సింగిల్ తీయటమో కనిపించేది. ఇలా ప్రతి బంతికి జరిగేది. దీంతో.. తీవ్రమైన టెన్షన్ వచ్చేసింది. దాని నుంచి రిలీప్ కోసం బాత్రూంకు వెళ్లేవాడిని. అక్కడైతే అంతా నివ్శబద్దంగా ఉంటుందని. అయితే.. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుంటూ క్రీజ్ లో ఉన్న కివీస్ బ్యాట్సమెన్లు కేన్.. టేలర్ లు మాత్రం తమ పాత్రను అద్భుతంగా పోషించి మ్యాచ్ ను పూర్తి చేసి అపూర్వమైన విజయాన్ని సొంతమయ్యేలా చేశారు’’ అని పేర్కొన్నారు. మొత్తంగా తన జీవితంలో క్రికెట్ చూసేందుకు విపరీతంగా టెన్షన్ పడిన సందర్భం ఇదేనని పేర్కొన్నారు. ఇదంతా విన్నప్పుడు టీమిండియాకు వారి అభిమానులు ప్రత్యక్షంగా అంతలా సపోర్టు చేసినప్పటికి.. ఫలితం మాత్రం భిన్నంగా రావటం గమనార్హం.